ఉప ముఖ్యమంత్రిని కలిసిన చలసాని.
విద్యా సమస్యలపై చర్చ.
Views: 21
On
సత్తుపల్లి, నవంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రైవేట్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కను విద్యాసంస్థల అధినేత చలసాని సాంబశివరావు శనివారం కలిసి వివరణ ఇచ్చారు.
జిల్లాలో విద్యాసంస్థలు కొనసాగుతున్న విధానంలో తలెత్తుతున్న అడ్డంకులు, ఫీజు రీయింబర్స్మెంట్ ఆలస్యాలు, అనుమతుల సమస్యలు తదితర అంశాలపై వివరమైన నివేదికను చలసాని అందజేశారు.
సమావేశం అనంతరం మంత్రి బట్టి స్పందిస్తూ, జిల్లాలో విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలను అతి త్వరలో దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ భేటీలో చలసాని సాంబశివరావుతో పాటు ప్రైవేట్ పాఠశాల జిల్లా నాయకుడు నాయుడు వెంకటేశ్వరరావు కూడా పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments