కాకర్లపల్లి జడ్పీ హైస్కూల్‌లో బాలహక్కుల వారోత్సవాలు.

కాకర్లపల్లి జడ్పీ హైస్కూల్‌లో బాలహక్కుల వారోత్సవాలు.

సత్తుపల్లి, నవంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు):

మండల పరిధిలోని కాకర్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల హక్కుల వారోత్సవాల భాగంగా 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో విద్యార్థులకు బాలల హక్కులు, వ్యక్తిగత పరిశుభ్రత, పౌష్టికాహారం, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. అనంతరం పిల్లలతో ప్రతిజ్ఞ చేయించారు.

సిడిపిఓ మెహర్ ఉన్నిసా మాట్లాడుతూ, పిల్లలు తమ హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలని, పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని సూచించారు. మంచి–చెడును తెలుసుకుని సమాజంలో మంచినీ గ్రహించే అలవాటు పెంపొందించుకోవాలని, ప్రతి విషయాన్ని తల్లిదండ్రులతో చర్చించే సంస్కారం ఉండాలని ఆమె విద్యార్థులను కోరారు.

కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి, కాకర్లపల్లి పంచాయతీ పరిధిలోని అంగన్వాడి సిబ్బంది, పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)  ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...
వికలాంగ అనాధ చిన్నారులకు అల్టిట్యూడ్ విద్యార్థుల చేయూత
నేడు విద్యుత్ సరఫరా అంతరాయం
అంగన్వాడీ ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్
200వ జ్ఞానమాల కార్యక్రమానికి వజ్రష్ యాదవ్‌కు ఆహ్వానం
గ్లోబల్ సమ్మిట్ బందోబస్త్ ఏర్పాట్లను సమీక్షించిన ఏడీజీ మహేష్ భగవత్ ఐపీఎస్
దుర్గామాత దేవాలయం నవమ  బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న నెమలి అనిల్