కేటీఆర్‌పై జరుగుతున్న కుట్రలను సహించేది లేదు

వేలేరు మండల బిఆర్ఎస్ పార్టీ  యూత్ ఇంచార్జ్ ఇట్టబోయిన సంపత్

కేటీఆర్‌పై జరుగుతున్న కుట్రలను సహించేది లేదు

వేలేరు, 22 నవంబర్ (తెలంగాణ ముచ్చట్లు):

కేటీఆర్‌పై సాగుతున్న కక్షసాధింపు చర్యలను ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారని, ఇకపై అలాంటి ప్రయత్నాలను సహించబోమని వేలేరు మండల బిఆర్ఎస్ పార్టీ  యూత్ ఇంచార్జ్ ఇట్టబోయిన సంపత్ అన్నారు.

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో దొంగ ఓట్ల సహాయంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అదే విధమైన దౌర్జన్యాన్ని కొనసాగిస్తున్నదని ఆయన విమర్శించారు. గవర్నర్‌పై ఒత్తిడి చేసి కేటీఆర్‌పై కేసులు పెట్టే ప్రయత్నం ప్రజాస్వామ్య వ్యవస్థపై నేరుగా దాడి చేయడమేనని సంపత్ అభిప్రాయపడ్డారు.

ఎలాంటి కేసులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రజల మద్దతు తమతో ఉందని, న్యాయస్థానాలపై పూర్తిగా నమ్మకం ఉందని ఆయన తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా గ్రహించాలని, లేకుంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే తన నిర్ణయం తెలియజేస్తారని ఆయన హెచ్చరించారు.వేలేరు మండలంలో జరిగిన సమావేశంలో సంపత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)  ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...
వికలాంగ అనాధ చిన్నారులకు అల్టిట్యూడ్ విద్యార్థుల చేయూత
నేడు విద్యుత్ సరఫరా అంతరాయం
అంగన్వాడీ ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్
200వ జ్ఞానమాల కార్యక్రమానికి వజ్రష్ యాదవ్‌కు ఆహ్వానం
గ్లోబల్ సమ్మిట్ బందోబస్త్ ఏర్పాట్లను సమీక్షించిన ఏడీజీ మహేష్ భగవత్ ఐపీఎస్
దుర్గామాత దేవాలయం నవమ  బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న నెమలి అనిల్