కృష్ణ నగర్ కాలనీలో  సిసి రోడ్, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

కృష్ణ నగర్ కాలనీలో  సిసి రోడ్, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

నాగారం, నవంబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు)

నాగారం మున్సిపల్ పరిధిలోని గోధుమకుంట టీపీఎస్ కృష్ణ నగర్ కాలనీ అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. కాలనీ వాసుల అభ్యర్థనపై కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న సిసి రోడ్ మరియు డ్రైనేజీ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా నాగారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వంగేటి పర్వత రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించి పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాలనీ ప్రజలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సిసి రోడ్డు, డ్రైనేజీ సమస్యలు పరిష్కారమవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. నాణ్యతతో, వేగంగా పనులను పూర్తి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు.ఈకార్యక్రమం లో కీసర మండలం కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు చీర వినోద్, కాలనీ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, జనరల్ సెక్రటరీ కార్తిక్ సహా కాలనీవాసులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)  ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...
వికలాంగ అనాధ చిన్నారులకు అల్టిట్యూడ్ విద్యార్థుల చేయూత
నేడు విద్యుత్ సరఫరా అంతరాయం
అంగన్వాడీ ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్
200వ జ్ఞానమాల కార్యక్రమానికి వజ్రష్ యాదవ్‌కు ఆహ్వానం
గ్లోబల్ సమ్మిట్ బందోబస్త్ ఏర్పాట్లను సమీక్షించిన ఏడీజీ మహేష్ భగవత్ ఐపీఎస్
దుర్గామాత దేవాలయం నవమ  బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న నెమలి అనిల్