ప్రభుత్వ ఆసుపత్రిలో అమృత ధార ట్రస్ట్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమం

మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు

ప్రభుత్వ ఆసుపత్రిలో అమృత ధార ట్రస్ట్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమం

మల్కాజిగిరి, నవంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు)

వట్టిపల్లి యాదమ్మ అమృత ధార ట్రస్ట్ అందిస్తున్న సేవలు అభినందనీయమని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తెలిపారు. యూత్ కాంగ్రెస్ నాయకులు కీర్తిశేషులు నరేష్ 37వ జయంతి సందర్భంగా శనివారం మల్కాజిగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రస్ట్ ఆధ్వర్యంలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మైనంపల్లి హనుమంతరావు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ—ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ వైస్ చైర్మన్ మనోహర్ మరియు వారి కుటుంబ సభ్యులు అభినందనీయులని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగించాలని, స్వచ్ఛంద సంస్థలు ప్రజా సేవలో ముందుండాలని సూచించారు. పేదలకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి లభిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, ఎంఎస్‌పి జిల్లా అధ్యక్షులు కేశపాగ రామచందర్ మాదిగ, రామకృష్ణ, జ్యోతి కుమార్, కిరణ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారుIMG-20251122-WA0060

Tags:

Post Your Comments

Comments

Latest News

దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)  ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...
వికలాంగ అనాధ చిన్నారులకు అల్టిట్యూడ్ విద్యార్థుల చేయూత
నేడు విద్యుత్ సరఫరా అంతరాయం
అంగన్వాడీ ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్
200వ జ్ఞానమాల కార్యక్రమానికి వజ్రష్ యాదవ్‌కు ఆహ్వానం
గ్లోబల్ సమ్మిట్ బందోబస్త్ ఏర్పాట్లను సమీక్షించిన ఏడీజీ మహేష్ భగవత్ ఐపీఎస్
దుర్గామాత దేవాలయం నవమ  బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న నెమలి అనిల్