లబ్ధిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎంపీ కడియం కావ్య
హన్మకొండ,నవంబర్20(తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ కనకదుర్గ కాలనీలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 11 మందికి రూ. 6 లక్షల 25 వేల విలువైన చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం ప్రభుత్వానికి ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తోందని, అనేక వేలాది పేద–మధ్యతరగతి కుటుంబాలకు ఈ పథకం జీవనాధారంగా మారిందని తెలిపారు. అర్హులైన ప్రతి వ్యక్తి ఈ పథకాన్ని వినియోగించుకొని ప్రయోజనం పొందాలని సూచించారు.
అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సీఎం సహాయం చేరేలా కృషి చేస్తానని ఎంపీ స్పష్టం చేశారు. లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు సీఎం సహాయనిధి అందేలా కృషి చేసినందుకు ఎంపీ కడియం కావ్యకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.


Comments