సత్తుపల్లిలో ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా నిర్వహణ.

సత్తుపల్లిలో ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా నిర్వహణ.

సత్తుపల్లి, జనవరి 18 (తెలంగాణ ముచ్చట్లు):

తెలుగు రాష్ట్రాల ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుడు, సినీ రంగంలో శిఖరస్థాయికి ఎదిగి రాజకీయాల్లో ప్రజా నాయకుడిగా విశిష్ట గుర్తింపు పొందిన స్వర్గీయ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) వర్ధంతిని సత్తుపల్లి పట్టణం మెయిన్ రోడ్‌లో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్, ఎన్టీఆర్ సేవలను స్మరించుకుంటూ ఆయన ప్రజాసేవా తపనను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, పార్టీ అభిమానులు, సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా విభాగం, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యుఐ నాయకులు పాల్గొని ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పించారు.IMG-20260118-WA0013

Tags:

Post Your Comments

Comments

Latest News

పెద్దమందడిలో ప్రెస్ క్లబ్ భవనానికి స్థల పరిశీలన పెద్దమందడిలో ప్రెస్ క్లబ్ భవనానికి స్థల పరిశీలన
పెద్దమందడి,జనవరి27(తెలంగాణ ముచ్చట్లు): పెద్దమందడి మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కోసం మంగళవారం స్థల పరిశీలన చేపట్టినట్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎం. ఈశ్వర్ తెలిపారు....
పేద కుటుంబానికి అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి
పారదర్శకంగా మునిసిపల్ ఎన్నికల నిర్వహణ.. 
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన వెల్టూర్ గ్రామ నాయకులు
కీసరలో ‘అరైవ్ అలైవ్–2026’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం
వాజపేయి నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి, సఫిల్‌గూడ సబ్‌వే పనులకు శంకుస్థాపన
పామాయిల్ తోటల్లో పసుపు సాగు విజయవంతం.!