సత్తుపల్లిలో ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా నిర్వహణ.
Views: 49
On
సత్తుపల్లి, జనవరి 18 (తెలంగాణ ముచ్చట్లు):
తెలుగు రాష్ట్రాల ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుడు, సినీ రంగంలో శిఖరస్థాయికి ఎదిగి రాజకీయాల్లో ప్రజా నాయకుడిగా విశిష్ట గుర్తింపు పొందిన స్వర్గీయ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) వర్ధంతిని సత్తుపల్లి పట్టణం మెయిన్ రోడ్లో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్, ఎన్టీఆర్ సేవలను స్మరించుకుంటూ ఆయన ప్రజాసేవా తపనను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, పార్టీ అభిమానులు, సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా విభాగం, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నాయకులు పాల్గొని ఎన్టీఆర్కు ఘన నివాళులు అర్పించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments