రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు శ్రీజ ఎంపిక
కొమురం భీం,ఆగస్టు22(తెలంగాణ ముచ్చట్లు):
కొమురం భీం జిల్లా గోలేటి టౌన్షిప్ వేదికగా జరగనున్న 71వ సీనియర్ రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ మహిళల ఛాంపియన్షిప్ కు జాగృతి ఉమెన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థిని మ్యాదరబోయిన శ్రీజ ఎంపికయ్యారు. బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్న శ్రీజ రాష్ట్రస్థాయిలో పాల్గొనే అర్హత సాధించడం కళాశాల వర్గాల్లో ఆనందం నింపింది.
ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ ఎల్ది మహేందర్, డైరెక్టర్స్ ఎల్ది రవీందర్, దావు శ్రీనివాస్ రెడ్డి, ఏ. సునీల్, ఎల్ది రాజు, ప్రిన్సిపాల్ ఎల్. ఉమాపతిరావు, ఫిజికల్ డైరెక్టర్ శ్రీధర్ల కుమారస్వామి, లెక్చరర్లు ఏ. చిరంజీవి, చిట్యాల నరేష్, హెచ్. శ్రీకాంత్, జి. వీరాచారి, ఎ. కృష్ణ, మంజుల ఆమె విజయంపై హర్షం వ్యక్తం చేశారు.వారు మాట్లాడుతూ శ్రీజ కృషి, క్రీడాస్ఫూర్తి రాష్ట్రస్థాయి పోటీల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.
Comments