దళిత సంఘాల  రాష్ట్ర కమిటీ జిల్లా అధ్యక్షులుగా సానాది సాయిబాబా నియామకం

దళిత సంఘాల  రాష్ట్ర కమిటీ జిల్లా అధ్యక్షులుగా సానాది సాయిబాబా నియామకం

కీసర, ఆగస్టు 22 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ దళిత సంఘాల ఐకాస రాష్ట్ర కమిటీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులుగా సానాది సాయిబాబ నియామకం జరిగింది. శుక్రవారం రోజున హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు బత్తుల చంద్రం చేతుల మీదుగా నియామకపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా నూతన అధ్యక్షులు సానాది సాయిబాబ మాట్లాడుతూ, రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల హక్కుల సాధన కోసం దళిత సంఘాల ఐకాస చేపట్టబోయే ప్రతి కార్యక్రమంలో తన వంతు పాత్రను నిర్వర్తిస్తానని తెలిపారు. మహాత్మ జ్యోతిరావు పూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాల సాధనకై నిరంతర పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.

అలాగే, 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు అయ్యే వరకు నిరంతర ఉద్యమం కొనసాగుతుందని, అంతిమంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో వెనుక బడిన వర్గాలకు పొందుపరిచి న హక్కుల సాధనకై తన పోరాటం ఆగదని చెప్పారు.తనను నమ్మి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించి నందుకు రాష్ట్ర అధ్యక్షులు బత్తుల చంద్రం కి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సునీల్, రాష్ట్ర యువజన విద్యార్థి సంఘం ఇంచార్జి వనం రమేష్, దళిత సంఘాల రాష్ట్ర నాయకులు బయ్యారం రాజన్న, తుమ్మ శ్రీనివాస్, చిప్పల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .