యువ న్యాయవాదిని సత్కరించిన సోయం వీరభద్రం.
విద్య ద్వారానే సమాజంలో గౌరవం.
అశ్వరావుపేట, జనవరి 19 (తెలంగాణ ముచ్చట్లు):
స్థానిక మండల పరిధిలోని తిరుమలకుంట గ్రామానికి చెందిన కొనకళ్ల అంకిత ఇటీవల ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా, అశ్వరావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు సోయం వీరభద్రం ఆదివారం అంకిత స్వగృహం వద్ద ఘనంగా శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సోయం వీరభద్రం మాట్లాడుతూ, విద్య ద్వారానే సమాజంలో గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు. గ్రామానికి చెందిన అంకిత జాతీయ స్థాయి న్యాయ పరీక్షలో విజయం సాధించడం అభినందనీయమని తెలిపారు. న్యాయవాద రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం అంకిత తల్లిదండ్రులు కొనకళ్ల శ్రీనివాసరావు, విజయలక్ష్మిని సత్కరించారు.
తదుపరి అశ్వరావుపేట మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు జుజ్జరి వెంకన్నబాబు నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని పరామర్శించారు. అలాగే ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుమలకుంట గ్రామ పంచాయితీ నుంచి బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన మాడి ముత్యాలరావును వారి నివాసంలో కలిసి ఓటమికి గల కారణాలను విశ్లేషించారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలని సూచిస్తూ ఆయనకు మనోధైర్యం కల్పించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బొల్లికొండ చెన్నారావు, జుజ్జురి సత్యనారాయణ, యువజన నాయకులు పానుగంటి చెన్నారావు, దాసరి రాజా, సిరి బత్తుల శ్రీనివాసరావు, కోర్సా జోగారావు, పోతురాజు, మోడియం పుల్లయ్య, కుర్సం వెంకటేష్, డెరంగుల చిన్నబాబు, రామకృష్ణ, మడకం ముత్యాలరావు, మధులత, మాడి సీత, అశ్వరావుపేట నియోజకవర్గ యువ రాజకీయ నాయకుడు వాడే వీరస్వామి తదితరులు, పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.


Comments