రైతుల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం 

ఎంపీ ఈటల రాజేందర్

రైతుల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం 

జమ్మికుంట,నవంబర్20(తెలంగాణ ముచ్చట్లు): 

రైతుల సమస్యలను రాష్ట్ర  ప్రభుత్వం పట్టించుకోవట్లేదని 
ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు.గురువారం జమ్మికుంటలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్‌మీట్‌లో, రైతుల సమస్యలు, పంట కొనుగోలు, పత్తి మార్కెట్ పరిస్థితులు, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు వంటి కీలక అంశాలపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ పంటలు చేతికొచ్చినా మార్కెట్‌యార్డుల్లో కాంటాలు లేకపోవడం, మిల్లర్ల వద్ద రోజులు గడిపినా ధాన్యం దింపుకోనివ్వక రైతులను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని తీవ్రంగా విమర్శించారు. క్వింటాల్‌కు 8 కేజీల తరుగు విధించడం దోపిడీగా అభివర్ణించారు.
రైతులకు ప్రకటించిన సన్నవడ్ల బోనస్ అందరికీ చేరలేదని, ఈసారి మాత్రం ప్రతి రైతుకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు లక్షల రుణమాఫీ ఇప్పటికీ పెండింగ్‌లో ఉండటం, వర్షాలు–తుఫాన్ల వల్ల భారీగా ముంచిన వరి పంటపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. నష్టపోయిన రైతులకు ప్రకటించిన 10 వేల రూపాయలు వెంటనే చెల్లించాలని ఆయన కోరారు.

పత్తి కొనుగోలులో ఆలస్యం లేకుండా, కఠినంగా అమలు చేస్తున్న 7 క్వింటాళ్ల నిబంధనను ఎత్తివేయాలని, ఈసారి వర్షాల నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని సీసీఐ నిబంధనలు సడలించాలన్నారు. ఫసల్ భీమా సకాలంలో చెల్లించి ఉండి ఉంటే రైతులు ఇబ్బందులు పడరని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ మాదే ...ఈటల ధీమా

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సర్పంచులు, వార్డు సభ్యులు, జేడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, జీపిటీసీ స్థానాల్లో తమకే స్పష్టమైన మెజారిటీ ఉంటుందని ఈటల తెలిపారు. స్థానిక నాయకులు ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్నందున వారి ఆత్మవిశ్వాసం బలంగా ఉందని పేర్కొన్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత కీలకమని, రెండు మున్సిపాలిటీల్లో కూడా బూత్ స్థాయిలో పటిష్ట ఏర్పాట్లతో విజయం సాధిస్తామన్నారు. 107 గ్రామ పంచాయితీల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకునే సామర్థ్యం తమకుందని స్పష్టం చేశారు. త్వరలోనే నాయకులు, కార్యకర్తలతో వ్యూహరచన సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.తాను హుజూరాబాద్ ప్రజలకు హామీ ఇస్తున్నానని, గెలిపించిన ప్రజాప్రతినిధుల పనులు పూర్తయ్యే బాధ్యత తనదేనని ఈటల అన్నారు. గతంలో తనపై చేసిన ఆరోపణలపై స్పందిస్తూ, తాను గెలిచిన ఏడాది తరువాతే ఎందుకు ధర్నా చేశారు, ఇప్పుడు గెలిచి రెండు సంవత్సరాలు అయిన తరువాత ఏమి చేశారో ప్రజలు ప్రశ్నిస్తున్నారని వ్యాఖ్యానించారు.

హుజూరాబాద్ ప్రజలతో గుండెల్లో ఉన్న బంధం...ఈటల భావోద్వేగం

హుజూరాబాద్ తనకు 25 ఏళ్లుగా గుండెపోటుగా ఉన్న ప్రదేశమని, ఆ బంధాన్ని ఎప్పటికీ మర్చిపోనని ఈటల పేర్కొన్నారు.
సార్వత్రిక అభివృద్ధికి తాను చేసిన పనులను గుర్తుచేస్తూ— నాలుగు లైన్ రహదారులు, నిరంతర విద్యుత్ సరఫరా కోసం నిర్మించిన సబ్‌స్టేషన్లు, జలకళ కోసం చెక్‌డ్యామ్‌లు, కమలాపూర్‌లో అభివృద్ధి చేసిన విద్యా కేంద్రం— ఇవన్నీ ప్రజలకు తెలుసని చెప్పారు.
అబద్ధాలను నమ్ముకుని జీవించే నేతలకు ప్రజలే సమాధానం చెబుతారని తీవ్రంగా విమర్శించారు.ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభా, బీజేపీ కన్వీనర్ మాడ గౌతం రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు, జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ శీలం శ్రీనివాస్, జీడి మల్లేష్, మాజీ సర్పంచ్ సురేందర్ రాజు, మాజీ జెడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్, మహిళా మోర్చా ప్రతినిధి రమ రెడ్డి, నాయకులు సమ్మయ్య, దేవిక, చొప్పరి వేణు, గుంటూరు ప్రభాకర్, బోరెల్లి సురేష్, గణేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)  ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...
వికలాంగ అనాధ చిన్నారులకు అల్టిట్యూడ్ విద్యార్థుల చేయూత
నేడు విద్యుత్ సరఫరా అంతరాయం
అంగన్వాడీ ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్
200వ జ్ఞానమాల కార్యక్రమానికి వజ్రష్ యాదవ్‌కు ఆహ్వానం
గ్లోబల్ సమ్మిట్ బందోబస్త్ ఏర్పాట్లను సమీక్షించిన ఏడీజీ మహేష్ భగవత్ ఐపీఎస్
దుర్గామాత దేవాలయం నవమ  బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న నెమలి అనిల్