మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష

మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష

వేలేరు,20 నవంబర్(తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై అజ్మీరా సురేష్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీల్లో, కారు డ్రైవర్ గుగులోత్ నర్సింహులు మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.వేలేరు లోక్యా తండాకు చెందిన నర్సింహులను తనిఖీల సమయంలో ఆపి శ్వాస పరీక్ష చేయగా, మోతాదుకు మించగా మద్యం సేవించినట్లు తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు.కేసును పరిశీలించిన హనుమకొండ రెండవ తరగతి అదనపు న్యాయమూర్తి నర్సింహులకు రెండు రోజుల కారాగార శిక్ష విధిస్తూ తీర్పు తెలిపారు. అనంతరం నిందితుడిని హుజురాబాద్ ఉపజైలుకు తరలించినట్లు ఎస్సై సురేష్ వెల్లడించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)  ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...
వికలాంగ అనాధ చిన్నారులకు అల్టిట్యూడ్ విద్యార్థుల చేయూత
నేడు విద్యుత్ సరఫరా అంతరాయం
అంగన్వాడీ ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్
200వ జ్ఞానమాల కార్యక్రమానికి వజ్రష్ యాదవ్‌కు ఆహ్వానం
గ్లోబల్ సమ్మిట్ బందోబస్త్ ఏర్పాట్లను సమీక్షించిన ఏడీజీ మహేష్ భగవత్ ఐపీఎస్
దుర్గామాత దేవాలయం నవమ  బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న నెమలి అనిల్