మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష
Views: 5
On
వేలేరు,20 నవంబర్(తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై అజ్మీరా సురేష్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీల్లో, కారు డ్రైవర్ గుగులోత్ నర్సింహులు మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.వేలేరు లోక్యా తండాకు చెందిన నర్సింహులను తనిఖీల సమయంలో ఆపి శ్వాస పరీక్ష చేయగా, మోతాదుకు మించగా మద్యం సేవించినట్లు తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు.కేసును పరిశీలించిన హనుమకొండ రెండవ తరగతి అదనపు న్యాయమూర్తి నర్సింహులకు రెండు రోజుల కారాగార శిక్ష విధిస్తూ తీర్పు తెలిపారు. అనంతరం నిందితుడిని హుజురాబాద్ ఉపజైలుకు తరలించినట్లు ఎస్సై సురేష్ వెల్లడించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
03 Dec 2025 21:50:31
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)
ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...


Comments