ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలి

హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య

ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలి

-హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు : 

ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అన్నారు.బుధవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరిలోని జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను  జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

 WhatsApp Image 2024-12-04 at 9.32.42 PM  ఈ సందర్భంగా అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చేపట్టినపనులను కలెక్టర్ పరిశీలించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల్లో చేపట్టిన  తాగునీరు, విద్యుత్, టాయిలెట్స్, ఇతర మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. 

 అనంతరం పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని  కలెక్టర్ పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి  విద్యార్థులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో వాసంతి, డిఆర్డివో మేన శ్రీను, ఎంపీడీవో అనిల్ కుమార్, సంబంధిత శాఖల  అధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మృతుల కుటుంబాలకు మంత్రి పొంగులేటి పరామర్శ మృతుల కుటుంబాలకు మంత్రి పొంగులేటి పరామర్శ
ఖమ్మం బ్యూరో డిసెంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు)  తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి  రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కాంగ్రెస్...
బాధ్యతాయుత జర్నలిజమే లక్ష్యం
గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీనే బలంగా ఉంది
కుషాయిగూడ డివిజన్ ఏర్పాటును అడ్డుకునేందుకు కుట్రలు 
పీచరలో కూరగాయల మార్కెట్‌కు స్థల పరిశీలన
నూతనంగా ఎన్నికైన అయ్యవారిపల్లె, పెద్ద మునగల్ షెడ్ సర్పంచులకు ఘన సన్మానం 
ఎన్నికల విధుల్లో అకాల మరణం పొందిన వెంకటాపురం ఎంపీడీవో రాజేంద్రప్రసాద్