ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలి

హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య

ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలి

-హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు : 

ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అన్నారు.బుధవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరిలోని జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను  జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

 WhatsApp Image 2024-12-04 at 9.32.42 PM  ఈ సందర్భంగా అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చేపట్టినపనులను కలెక్టర్ పరిశీలించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల్లో చేపట్టిన  తాగునీరు, విద్యుత్, టాయిలెట్స్, ఇతర మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. 

 అనంతరం పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని  కలెక్టర్ పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి  విద్యార్థులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో వాసంతి, డిఆర్డివో మేన శ్రీను, ఎంపీడీవో అనిల్ కుమార్, సంబంధిత శాఖల  అధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాం. కానీ ఈ పండుగకు నిజమైన అర్థం వచ్చేలా కార్మికుల జీవితాల్లో మార్పు రావాలి....
భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు సార్థకత
క్రికెట్ క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
మే డే వాల్ పోస్టర్ విడుదల
ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలలు సాకారం
దేశానికి ఆదర్శంగా భూ భారతి చట్టం... 
శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి......