చిలకటోనిపల్లి గ్రామ అంగన్వాడీలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

ఆరు నెలల వరకు తల్లిపాలు పట్టించాలి

చిలకటోనిపల్లి గ్రామ అంగన్వాడీలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

 ఐసిడిసి సూపర్ వైజర్ నాగమణి

వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:

పెద్దమందడి మండలం చిలకటోనిపల్లి లోని అంగన్వాడీ కేంద్రాలలో శనివారం అత్యంత ఘనంగా తల్లిపాల వారోత్సవాలు నిర్వ హించారు. ఐసీడిసీ సూపర్‌ వైజర్‌ నాగమణి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా నాగమణి మాట్లాడుతూ... తల్లిపాల వారోత్సవాలను వారం రోజులపాటు నిర్వహిస్తున్నమని తెలిపారు. తల్లి పాలు బిడ్డకు ఎంత అవసరమో తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని ఆమె చెప్పారు. గర్భవతులు సీజనల్ గా దొరికే విటమిన్ సి కలిగిన పోషకాహారం ఆకుకూరలు, పండ్లు తప్పనిసరిగా తీసుకోవడం వల్ల పెంచుకోవచ్చు, నిమ్మ జాతి పండ్లను తీసుకోవాలని వాడు తెలిపారు. పాలు, గుడ్డు, వేరుశనగలు, బెల్లం తీసుకోవడం వల్ల రక్తం పెరుగుతుందని ప్రతిరోజు ఆహారంతో పాటు ఐ వాట్ని తీసుకోవడం అలవర్చుకోవాలని వారు సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రతను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలని వారు సూచించారు. బిడ్డకు ఆరు నెలల వరకు తల్లి పాలు తప్ప ఏ ఇతర ద్రవపదార్థాలు తా గించకూడదని నాగమణి తెలిపారు. బిడ్డ పుట్టిన గంటలోనే తల్లియొక్క పసుపు రంగు యొక్క చిక్కటి పాలు (ముర్రుపాలు) అమృతం లాంటివని ఆమె పేర్కొన్నారు. వీటి ద్వారా బిడ్డకు అతిముక్యమైన పోషకాలు లభి స్తాయని తెలిపారు. తల్లిపాలు బిడ్డ శరీరానికి, మెదడు కూడా పోషణను ఇస్తుందన్నారు. తల్లి పాలలో వున్న పోషక గుణాలు మరి ఏ ఇతర పాలల్లో వుండవని నాగమణి స్పష్టం చేశారు. మరి ముఖ్యంగా తల్లిపాలు శిశువును న్యుమోనియా, అతిసార వ్యాధి వంటి ప్రమాధ కరమైన వ్యాధుల నుండి కాపాడుతుందని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమములో ఏఎన్ఎం తారాదేవి, అంగన్‌ వాడీ ఉపాధ్యాయురాలు గొంది మంజుల, ఆశా వసంత, ఆయా ఎం అంజమ్మ, సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశాలు, తల్లులు లబ్ధిదారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .