మానవ హక్కుల కమిషన్ కు వినతి మహిళా కార్పొరేటర్ లు రక్షణ కల్పించాలని
కార్పొరేటర్ మేకల సునీత రామ్ యాదవ్
మల్కాజ్గిరి, తెలంగాణ ముచ్చట్లు:
హైదరాబాద్ కోటీ లో ని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు మహిళా కార్పొరేటర్లు మానవ హక్కుల కమిషన్ కు ఆశ్రయించి రక్షణ కల్పించాలని కోరడం జరిగింది.
గత కొంతకాలంగా మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు మరియు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ తో పాటు కొంతమంది కాంగ్రెస్ నాయకులు తమపై దృశప్రచారం చేస్తూ తప్పుడు పోస్ట్లు సోషల్ బ్యానర్ లో పెడుతున్నారని వాళ్లపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిషన్ కు కోరడం జరిగినది.
కార్పొరేటర్ లు తెలిపారు అలాగే బోనాల చెక్కుల పంపిణీ ఘటనలో తమపై దాడికి పాల్పడ్డ వారిని పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకొని అల్వాల్ సీఐ మరియు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు కార్పొరేటర్ లు మేకల సునీత రాము యాదవ్ మరియు డివిజన్ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాసరెడ్డి అలాగే వెంకటాపురం డివిజన్ కార్పొరేటర్ సబిత కిషోర్ తెలిపారు
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబిత అనిల్ కిషోర్ గౌడ్, మేకల సునీత రాము యాదవ్, బైరూ అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Comments