సుప్రీం తీర్పు ప్రకారం స్పీకర్ తక్షణం నిర్ణయం తీసుకోవాలి – మాజీ ఎమ్మెల్యే రాజయ్య

సుప్రీం తీర్పు ప్రకారం స్పీకర్ తక్షణం నిర్ణయం తీసుకోవాలి – మాజీ ఎమ్మెల్యే రాజయ్య

ఘనపురం:

సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య తెలిపారు. ఆలస్యం చేయకుండా మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కోర్టు సూచించిందని గుర్తు చేశారు.

“స్పీకర్ కాంగ్రెస్ నాయకుడిగా కాకుండా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిగా వ్యవహరించి చర్యలు తీసుకోవాలి” అని ఆయన స్పష్టం చేశారు.

రాజయ్య మాట్లాడుతూ, “రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ కోసం తిరుగుతుంటే, తెలంగాణలో రేవంత్ రెడ్డి రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. కడియం శ్రీహరి నీతి నిజాయితీ ఉంటే రాజీనామా చేసి ప్రజా క్షేత్రంలోకి రావాలి. ప్రజలే నిర్ణయం తీసుకుంటారు” అన్నారు.

2014లో టిడిపి, 2018లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల విలీనాల గురించి మాట్లాడుతూ, “అప్పుడు ఎవరి ఇంటికీ కేసీఆర్ వెళ్లి కండువా కప్పి ఆహ్వానించలేదు. కడియం శ్రీహరి కూడా తనతో పాటు 25 మంది ఎమ్మెల్యేలతో వచ్చి మంత్రిగా అవుతానని భావించారు” అని రాజయ్య విమర్శించారు.

పార్టీ ఫిరాయించిన 10 మంది పై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే స్పీకర్ పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన 
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
మీనాక్షి నటరాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు గట్టు రాజు 
భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి నందుకు కార్పొరేటర్ కు సంతోషం వ్యక్తం చేసిన కాలనీవాసులు. 
బోనాల పండుగ ఉత్సవాల లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
దమ్మాయిగూడ జాతీయ మాల మహానాడు సంఘం అధ్యక్షులుగా 
50వ వివాహ వార్షికోత్సవ వేడుకలు బాబా సాహెబ్ సన్నిధిలో 
మల్లాపూర్ అంబేద్కర్ సంఘం బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న