అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన
మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్ప రామారావు
దమ్మాయిగూడ, తెలంగాణ ముచ్చట్లు:
దమ్మాయిగూడ మున్సిపాలిటీ లో పారిశుద్ధ్య లోపానికి కారణమయ్యే డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణాల కోసం కృషి చేస్తున్నామని దమ్మాయిగూడ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్ప రామారావు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ నాలుగో వార్డు ఇందిరమ్మ కాలనీలో మార్కెట్ యార్డ్ దగ్గర కేఎల్ఆర్ వాటర్ ఫిల్టర్ నుంచి సైదులు ఇల్లు వరకు 5లక్షల రూపాయలతో భూగర్భ డ్రైనేజీ పనులకు బండ్లగూడ మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గండి యాదగిరి గౌడ్ తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ముప్పా రామారావు మాట్లాడుతూ దమ్మాయిగూడ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. మరిన్ని నిధులు తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో దమ్మాయిగూడ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఏనుగు సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ దమ్మాయిగూడ మాజీ ఉపాధ్యక్షులు గోవింద్ సింగ్, 4వ వార్డ్ కాంటెస్ట్ కౌన్సిలర్ దిలీప్ కుమార్, బి బ్లాక్ ప్రెసిడెంట్ ఈగశ్వేత, మాజీ వార్డ్ మెంబర్ బత్తుల సునీత సైదులు, మాజీ వార్డ్ మెంబర్ మణిపాల్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బజరంగ్ లాల్, కిషన్ సింగ్,1వ వార్డ్ కాంటెస్ట్ కౌన్సిలర్ శ్రీను, కొత్త రాజేశ్ గౌడ్, పోలు సాయి గౌడ్, వేణు గోపాల్ రెడ్డి, 4వ వార్డ్ మహిళా ప్రెసిడెంట్ బాలమణి, మహిళా నాయకురాలు, కాంగ్రెస్ నాయకులు, యువకులు, గ్రామ పెద్దలు కాలనీ వాసులు పాల్గొన్నారు.
Comments