దమ్మాయిగూడ జాతీయ మాల మహానాడు సంఘం అధ్యక్షులుగా
అరిగే నాగరాజు నియామకం
దమ్మాయిగూడ, తెలంగాణ ముచ్చట్లు:
దమ్మాయిగూడ మున్సిపాలిటీ జాతీయ మాల మహానాడు సంఘం అధ్యక్షులుగా అరిగే నాగరాజు నియామకం. జాతీయ మాల మహానాడు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆదేశాల మేరకు జాతీయ మాల మహానాడు సంఘం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కన్వీనర్ గుజ్జుక పరశురాం ఆర్ జి కే కాలనీకి చెందిన అరిగే నాగరాజు ను దమ్మాయిగూడ మున్సిపాలిటీ జాతీయ మాల మహానాడు సంఘం అధ్యక్షులుగా ప్రకటిస్తూ నియామక పత్రాన్ని చైతన్య భూమి ప్రాంగణంలో మాల సంక్షేమ సంఘం కమిటీ సభ్యుల సమక్షంలో అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా నూతనంగా నియమించబడ్డ దమ్మాయిగూడ మున్సిపాలిటీ మాల సంఘం అధ్యక్షులు అరిగే నాగరాజు మాట్లాడుతూ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధనకై, రాజ్యాంగ పరిరక్షణకై మాల సంఘం ఉన్నతిని కాపాడుతూ నా జాతికి సేవ చేస్తానని తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆర్ జి కే కాలనీ మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు యాట రాజు, అధ్యక్షులు అబ్బులు,ఆర్ జి కె కాలనీ డెవలప్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ఉపాధ్యక్షులు రాజేంద్రప్రసాద్,ఆర్ జి కె కాలనీ డెవలప్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ఆర్గనైజేషన్ సెక్రెటరీ,మాల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి సానాది సాయిబాబ,కాలనీ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రాధాకృష్ణ , మాల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు దుబాయ్ రాజు, కోశాధికారి చేన్నయ్య , ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు,మాల సంఘం కమిటీ సభ్యులు కె.వి రావు, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments