న్యాయ పోరాటాలకు కాంగ్రెస్ కట్టుబాటు
ఏఐసీసీ లీగల్ సెల్ ఈవెంట్లో ఎంపీ వంశీకృష్ణ
Views: 2
On
న్యూ ఢిల్లీ
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఏఐసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఈవెంట్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న వక్కీలు, లీగల్ నిపుణులు, కాంగ్రెస్ పార్టీ నేతలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ,
“దేశ ప్రజల హక్కుల రక్షణ కోసం న్యాయ పోరాటాలు తప్పనిసరి. అందుకోసమే లీగల్ సెల్ కృషి చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన న్యాయవాదులను ముందుకు తీసుకువెళుతోంది,” అని పేర్కొన్నారు.
అలాగే, న్యాయ వ్యవస్థ పటిష్టత, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటాలకు బలాన్నిచ్చేలా ఉందని తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
04 Aug 2025 22:25:25
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు:
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
Comments