నాచారం డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరు

నాచారం డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరు

కాప్రా, తెలంగాణ ముచ్చట్లు:

నాచారం డివిజన్‌లోని అన్నపూర్ణ కాలనీ కమ్యూనిటీ హాల్ ముందు సిమెంటు రోడ్డుకు రూ.50 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ పనులను ఉప్పల్ శాసనసభ్యుడు బండారి లక్ష్మారెడ్డి స్థానిక కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు భారీ సంఖ్యలో హాజరై, రోడ్డుపనులకు నిధులు మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యేకు, కార్పొరేటర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. శాలువాలతో సత్కరించారు.

రాఘవేంద్రనగర్ అన్నపూర్ణ కాలనీలో ఇప్పటికే చాలా రోడ్లు కొత్తగా వేయించామని, ఈ సిమెంటు రోడ్డుతో చుట్టుపక్కల ప్రాంతాల రహదారి సమస్యలు తీరనున్నాయని కార్పొరేటర్ తెలిపారు. డివిజన్‌లో మిగిలిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఈ బాలకృష్ణ, ఏఈ వినీత్, స్థానిక ప్రజాప్రతినిధులు, బారస కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

చిలుక సత్యం సాగర్ ని సన్మానించిన బీసీ సమాజ్.. చిలుక సత్యం సాగర్ ని సన్మానించిన బీసీ సమాజ్..
మేడ్చల్, తెలంగాణ ముచ్చట్లు: జాతీయ మానవ హక్కులు మరియు సామాజిక న్యాయ సంఘం వనపర్తి జిల్లా చైర్మన్ గా చిలుక సత్యం సాగర్  ఎన్నికైన సందర్భంగా మంగళ...
జాతీయ మానవ హక్కులు , సామాజిక న్యాయ సంఘం వనపర్తి జిల్లా చైర్మన్ గా చిలుక సత్యం సాగర్
బిగ్ యూత్ అసోసియేషన్ పలహార బండి ఊరేగింపు 
కాంగ్రెస్ ప్రభుత్వం కపట ప్రేమతో బిసి రిజర్వేషన్ నిరసనలు  
క్రీడాకారుల కోచ్ లకు ప్రోత్సాహం అందించండి బొంతు శ్రీదేవి యాదవ్
ప్రపంచ శాంతి సంఘం ఆధ్వర్యంలో హీరోషిమా డే సామ్రాజ్యవాద వ్యతిరేక దినోత్సవం
పాత‌ కూర‌గాయ‌ల మార్కెట్‌కు రూ.55 ల‌క్ష‌ల నిధులు నిధులు మంజూరు