ఈవెంట్ సంస్థకు వెళ్తున్నానన్నాడు… తిరిగి రాలేదు

కుషాయిగూడ పరిధిలో ఓ వ్యక్తి అదృశ్యం 

ఈవెంట్ సంస్థకు వెళ్తున్నానన్నాడు… తిరిగి రాలేదు

కాప్రా, తెలంగాణ ముచ్చట్లు:
కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన కలకలం రేపుతోంది. పోలీసులు  తెలిపిన వివరాల ప్రకారం...సైనికపురి సాయిపురి కాలనీలో నివాసముండే రేణుకుంట దుర్గా ప్రసాద్ (వయసు: 36), ఈవెంట్ నిర్వాహకుడిగా పని చేస్తున్నారు. జూలై 25న శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో “కాచిగూడలో ఉన్న ఆర్ డి ప్రో ఈవెంట్స్‌కి వెళ్తున్నా”ని కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు.

అయితే అతను తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు జిపిఎస్ ద్వారా అతని ఫోన్ లొకేషన్ ట్రేస్ చేశారు. లొకేషన్ ప్రకారం అతడు చివరిసారిగా హైటెక్ సిటీ సమీపంలోని దుర్గం చెరువు వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడకు వెళ్లి గాలించినా అతని ఆచూకీ లభించలేదు.అపహరణ లేదా ఇతర కారణాలు అన్నది స్పష్టంగా తెలియకపోయినా, కుటుంబ సభ్యులు, బంధువులు పలుచోట్ల వెతికినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దీంతో దుర్గాప్రసాద్ సోదరుడు రేణుకుంట సాయి నరేష్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .