స్మశాన వాటిక అభివృద్ధి కొరకు రూ. 35 లక్షలు నిధులు మంజూరు పనులు ప్రారంభం
138 డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు పోతుల వినోద్ యాదవ్
Views: 1
On
మౌలాలి, తెలంగాణ ముచ్చట్లు:
మల్కాజ్గిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతన్న సహకారంతో హనుమాన్ నగర్ లోని స్మశాన వాటిక అభివృద్ధి కొరకు 35 లక్షలు నిధులు మంజూరు పనులు ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా 138 డివిజన్ అధ్యక్షుడు పోతుల వినోద్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి విషయంలో రోడ్ల విషయంలో కానీ, డ్రైనేజీ విషయంలో కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో గానీ, అనారోగ్యంతో బాధపడుతున్న బాధితుల విషయంలో గానీ ఏ విషయంలో అయినా మాజీ ఎమ్మెల్యే దగ్గరికి వెళితే వెంటనే స్పందించి పనులు చేయించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ స్మశాన వాటిక అభివృద్ధి కొరకు 35 లక్షల ఫండ్స్ ను రిలీజ్ చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలు అందరూ కి హృదయ పూర్వకంగా ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకన్న, సలీం, మల్లేష్ ఇర్ఫాన్ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
06 Aug 2025 22:38:26
మేడ్చల్, తెలంగాణ ముచ్చట్లు:
జాతీయ మానవ హక్కులు మరియు సామాజిక న్యాయ సంఘం వనపర్తి జిల్లా చైర్మన్ గా చిలుక సత్యం సాగర్ ఎన్నికైన సందర్భంగా మంగళ...
Comments