భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి నందుకు కార్పొరేటర్ కు సంతోషం వ్యక్తం చేసిన కాలనీవాసులు.
కార్పొరేటర్ శాంతి సాయి జన్ శేకర్
నాచారం, తెలంగాణ ముచ్చట్లు:
నాచారం డివిజన్ లో సాయి నగర్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి నందుకు కార్పొరేటర్ కు సంతోషం వ్యక్తం చేశారు.
నాచారం మెయిన్ రోడ్డు నుండి చంద్ర గ్రాండ్ హోటల్ పక్కనుండి ఇదివరకు ఉన్న ఓపెన్ నాలా గుండా సాయి నగర్ కాలనీ లోనికి వర్షపు నీరు మరియు డ్రైనేజీ నీరు వస్తుంది. ఇందులో సగం కంటే ఎక్కువ శాతం డ్రైనేజీ నిర్మాణం చేయడం జరిగింది. ఇంకా కొంత మిగిలి ఉండడంతో డ్రైనేజీలు నిండి ఇళ్లల్లోకి నీళ్లు వస్తున్నాయని మిగిలిన సుమారు 50 మీటర్లు కూడా డ్రైనేజీ నిర్మించాలని కాలనీ ప్రతినిధులు సోమవారం రోజు డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ ను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
సానుకూలంగా స్పందించిన కార్పొరేటర్ జలమండలి డీజీఎం సతీష్ తో మాట్లాడి మిగిలిన డ్రైనేజీ నిర్మించాలని సూచించడం జరిగింది. తప్పకుండా చేస్తానని డీజీఎం హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సాయి నగర్ కాలనీ ప్రెసిడెంట్ ఎంఏ రావూఫ్ ,జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్ ,వైస్ ప్రెసిడెంట్ మధు,
కోశాధికారి రాజు, వెంకటేష్ రావు, అక్బర్, నవీన్, సునీల్, రాజు,సుధాకర్,చారి
తదితరులు పాల్గొన్నారు.
Comments