సిపిఐ 4 వ రాష్ట్ర మహాసభల గోడ పత్రిక ఆవిష్కరణ
మల్కాజ్గిరి, తెలంగాణ ముచ్చట్లు:
సిపిఐ తెలంగాణ రాష్ట్ర 4 వ మహాసభల గోడపత్రికను శుక్రవారం నాడు వినాయక్ నగర్ లోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది .
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు సిహెచ్ దశరథ్ మండల కార్యదర్శి టి యాదయ్య గౌడ్ సహాయ కార్యదర్శి కాసర్ల నాగరాజు సంయుక్తంగా మాట్లాడుతూ దున్నేవాడికి భూమి కావాలని తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించి పది లక్షల ఎకరాల భూమిని ప్రజలకు పంచిన ఘన చరిత్ర సిపిఐ పార్టీదని కార్మికుల కర్షకుల శ్రమను దోచుకుంటున్న కార్పొరేట్ వర్గాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించి ఎనిమిది గంటల పని దినాల అమరులోకి తెచ్చింది భాషా సంయుక్త రాష్ట్రాల ఆవశ్యకతను గుర్తించి సాధించిన పార్టీ 4 వ రాష్ట్ర మహాసభకు ప్రజలందరూ ఆర్థిక హార్దిక సహకరించి మహాసభలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో మండల కార్యవర్గ సభ్యులు షేక్ అజిత్ బి యాదగిరి ఎస్ యూసుఫ్ కే పవన్ పి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments