రాచకొండ సెక్యూరిట్ కౌన్సిల్ అద్వరములో రెండోవిడత ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్

రాచకొండ సిపి సుధీర్ బాబు

రాచకొండ సెక్యూరిట్ కౌన్సిల్ అద్వరములో రెండోవిడత ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్

బసవతారక ఇండో క్యాన్సర్, మెడికవర్, సౌజన్య డెంటల్,   డా.ఐ అగర్వాల్ 
 
అంబర్ పేట, తెలంగాణ ముచ్చట్లు:

రాచకొండ పోలీస్ కమిషనరేట్ లోని పోలీసు సిబ్బంది మొత్తం ఆరోగ్యంగా ఉండాలని, వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా గుర్తించి ముందస్తుగా చికిత్స చేయించు కోవాలని రాచకొండ సిపి సుధీర్ బాబు ఐపిఎస్ అన్నారు. దీనికోసం రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ వారిచే ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతోందని ఆయన అన్నారు. సిబ్బంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని ముందస్తు గా చికిత్స తీసుకోవాలని కోరడం జరిగింది. 

మే నెలలో మల్కాజిగిరి జోన్ సిబ్బందికి మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అదేవిధం గా శుక్రవారం రోజు అంబర్ పేట హెడ్ క్వార్టర్ నందు అంబర్ పేట పోలీస్ సిబ్బందికి మరియు ఎల్బీనగర్ జోన్, మహేశ్వరం జోన్ సిబ్బందికి శుక్రవారం రోజు బసవతారం క్యాన్సర్ హాస్పిటల్, మెడికవర్, డా. ఐ అగర్వాల్, సౌజన్య డెంటల్ డాక్టర్లు పాల్గొన్నారు.

డా. కల్పన క్యాన్సర్ గురించి అవగాహన కల్పించారు. డాక్టర్ సురేష్ రెడ్డి గుండె సంబంధించిన సమస్యలను వివరించడం జరిగింది వాటి నివారణకు ఎలా జాగ్రత్త తీసుకోవాలి. మహిళ సిబ్బందికి ముందస్తుగా క్యాన్సర్ రాకుండా ఉండే విధంగా  చెకప్ లు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపు శనివారం కూడా కొనసాగుతుంది. 

ఈ కార్యక్రమంలో డిసిపి ఉషారాణి, ఉమెన్ సేఫ్టీ,డిసిపి శ్రీనివాసులు, ట్రాఫిక్, డీసీపీ శ్యాంసుందర్ సిఆర్ హెడ్ క్వార్టర్, సావిత్రి, ఆర్కే ఎస్సి చీఫ్ కో ఆర్డినేటర్, డాక్టర్ లు సరిత, అచ్యుత రావు, పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు సీహెచ్ భద్రా రెడ్డి, కృష్ణా రెడ్డి మరియు తదితర అధికారులు, సిబ్బంది  పాల్గొన్నారు.


WhatsApp Image 2025-08-01 at 2.42.55 PM

Tags:

Post Your Comments

Comments

Latest News

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన 
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
మీనాక్షి నటరాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు గట్టు రాజు 
భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి నందుకు కార్పొరేటర్ కు సంతోషం వ్యక్తం చేసిన కాలనీవాసులు. 
బోనాల పండుగ ఉత్సవాల లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
దమ్మాయిగూడ జాతీయ మాల మహానాడు సంఘం అధ్యక్షులుగా 
50వ వివాహ వార్షికోత్సవ వేడుకలు బాబా సాహెబ్ సన్నిధిలో 
మల్లాపూర్ అంబేద్కర్ సంఘం బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న