లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ఇన్వెస్టిచర్ సెర్మనీ

కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు

లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ఇన్వెస్టిచర్ సెర్మనీ

ఉప్పల్, తెలంగాణ ముచ్చట్లు:

ఉప్పల్‌లోని లిటిల్ ఫ్లవర్ పబ్లిక్ స్కూల్‌ నిర్వహించిన ఇన్వెస్టిచర్ సెర్మనీ కార్యక్రమానికి కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించారు. అనంతరం పాఠశాలలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు నియామక పత్రాలు, సర్టిఫికెట్లు అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి, పాఠశాల విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయని, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి బోధన విధానాలు ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారుWhatsApp Image 2025-07-25 at 10.00.20 PM. విద్యార్థులు చిన్ననాటి నుంచే చదువు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక బాధ్యతలు, నాయకత్వ లక్షణాలను నేర్చుకోవడం అవసరమన్నారు. ఇలా అభివృద్ధి చెందిన పిల్లలే భవిష్యత్తులో క్రమశిక్షణతో కూడిన ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బ్రదర్ జోసెఫ్ పసల, లుకాస్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .