ప్రజా ప్రభుత్వంలో నిరుపేదలకు నూతన రేషన్ కార్డులు పంపిణీ
కాంగ్రెస్ నాయకులు మద్దిర శ్రీశైలం
వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:
పెద్దమందడి మండలం పామిరెడ్డి పల్లి గ్రామం లో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. వనపర్తి శాసనసభ్యులు తూడి మేగా రెడ్డి ఆదేశాల మేరకు ప్రొసీడింగ్స్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ నాయకులు మద్దిర శ్రీశైలం మాట్లాడుతూ.. గత పది సంవత్సరాల నుండి రేషన్ కార్డు లేని వారికి కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేషన్ కార్డులేని నిరుపేదలకు రేషన్ కార్డు ఇస్తామని, ప్రజా ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చిన హామీని నెరవేర్చిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ప్రజా పాలనలో మాకు రేషన్ కార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, వనపర్తి శాసనసభ్యులు తూడిమేగా రెడ్డి కి లబ్ధిదారులు పూజిత, కొంకల శిరీష మాధవి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు సింగిల్ విండో డైరెక్టర్ వెంకటయ్య మధిర శ్రీశైలం,పాపిరెడ్డి, చందు, కొంకలి నరేష్, కృష్ణ,శివమల్లయ్య భాస్కర్ రెడ్డి, డీలర్ లక్ష్మణ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Comments