సీసీ రోడ్ల ,స్ట్రోమ్ వాటర్ డ్రైన్ నిర్మాణం కాలనీల వాసులకు ప్రొసీడింగ్స్ అందజేసిన
మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి,పరమేశ్వర్ రెడ్డి
ఉప్పల్, తెలంగాణ ముచ్చట్లు:
ఉప్పల్ డివిజన్ కు మరో సారి భారీగా నిధులను రాబట్టినట్టుగా ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.జీహెచ్ఎంసీ లోనే ఉప్పల్ డివిజన్ ను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్టుగా చెప్పారు.
ఉప్పల్ డివిజన్ లోని విజయపురి కాలనీ,సరస్వతి కాలనీ,సెవెన్ హిల్స్ కాలనీ,గణేష్ నగర్,శాంతి నగర్,పద్మావతి కాలనీలో సీసీ రోడ్డు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
సీసీ రోడ్ల మరామ్మతులకు రూ.1కోటి 82లక్షలు, స్ట్రోమ్ వాటర్ డ్రైన్ ఉప్పల్ హిల్స్ కాలనీ లో రూ 65 లక్షలు నిధులు మంజూరు చేయించి కాలనీ ల అసోసియేషన్ ప్రతినిధులకు నిధుల మంజూరు పత్రాలను రజిత పరమేశ్వర్ రెడ్డి , కాలనీ వాసులకు అంద చేశారు.
ఈ కార్యక్రమంలో ఉప్పల్ డివిజన్ అధ్యక్షులు బకారం లక్ష్మణ్ గారు,న్యూవిజయపురి కాలనీ అధ్యక్షులు లేళ్ల వెంకటేష్,నాగి రెడ్డి,సుంకు శేఖర్ రెడ్డి, నర్సింహ,ఉప్పల్ హిల్స్ కాలనీ వాసులు దుర్గం నవీన్ యాదవ్ ,గోవింద్ కుమార్ స్వామి,సల్లా ప్రభాకర్ రెడ్డి,పి రామచందర్ ,అక్కు రవి ,టి శ్రీనివాస్ రెడ్డి ,సంతోష్ రెడ్డి .రాజు చారి,మహేందర్ ,టి విజయ్ సింగ్ . ఏం సత్యనారాయణ చారి . ఎం సుధాకర్ రెడ్డి,శ్రీనివాసుచందు,
విమల్,సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
Comments