జర్నలిస్టు తిరుపతి రెడ్డిని పరామర్శించిన ఐజేయు నాయకులు
మధు గౌడ్ టీ యూ డబ్ల్యూ జే (ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి
వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:
వనపర్తి జిల్లా కొత్తకోట మండల రిపోర్టర్ గా ప్రజపక్షం పత్రికలో పని చేస్తున్న తిరుపతి రెడ్డి ఇటీవల అనారోగ్యం కు గురి అయ్యి మహబూబ్ నగర్ లో వైద్యం పొందారు. విషయం తెలుసుకున్న టి యు డబ్ల్యూ జె( ఐ జె యు ) నాయకులు సోమవారం సాయంత్రం తిరుపతి రెడ్డి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగితెలుసుకన్నారు. ఆరోగ్యపరంగా గాని ఇతర ఏదేని సమస్యల పరంగా గాని ఇబ్బింది ఉంటే తమ దృష్టికి తెస్తే వాటిపరిష్కరం విషయంలో యూనియన్ అండగా ఉంటుందని బరోసా కల్పించారు. పరామర్శించిన వారిలో టి యు డబ్ల్యూ జే (ఐ జె యు) రాష్ట్ర కార్యదర్శి జి మధు గౌడ్, ఐ జె యు జాతీయ కౌన్సిల్ మాజీ సభ్యులు మల్యాల బాలస్వామి వనపర్తి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి మాధవరావు, బి రాజు, ఉపాధ్యక్షులు నాకొండ యాదవ్, కోశాధికారి డి మన్యం, వనపర్తి నియోజకవర్గం అధ్యక్షులు బేక్కరీ విజయ్, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి అరుణ్, జర్నలిస్ట్ ఈశ్వర్ ఉన్నారు.
Comments