పాలకుర్తిలో ఉక్కులాంటి  యువతరం తయారు కావాలి

డీసీపీ రాజా మహేంద్ర నాయక్

పాలకుర్తిలో ఉక్కులాంటి  యువతరం తయారు కావాలి

పాలకుర్తి,తెలంగాణ ముచ్చట్లు:

పాలకుర్తి మండలకేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం స్వాగత తోరణం ఎదురుగా స్థాపించిన ఛం జిమ్ సెంటర్‌ను డీసీపీ రాజా మహేంద్ర నాయక్ ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని వ్యాయామ శిక్షకుడు, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి చెరిపెల్లి అశోక్ మహర్షి ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ...యువతలో వ్యాయామ పరంగా చైతన్యం పెంచడం హర్షణీయమని, పాలకుర్తిలో ఇదే మొదటి వ్యాయామ కేంద్రంగా గుర్తుంచుకోవచ్చని పేర్కొన్నారు. ఆరోగ్య పరిరక్షణకు మందులు, చికిత్సలకు మాత్రమే పరిమితం కాకుండా వాకింగ్‌, జాగింగ్‌, యోగా, జిమ్ వంటి సాధనాల ద్వారా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

వయస్సు, లింగం, సామాజిక-ఆర్థిక పరిస్థితుల తేడా లేకుండా ప్రతిఒక్కరూ తమకు అనుకూలంగా వ్యాయామ సమయాన్ని కేటాయించుకోవాలన్నారు. చిన్నారుల ఎదుగుదలలో శారీరక శ్రమ, పౌష్టికాహారం కీలకమైందని పేర్కొన్నారు. జిమ్‌కు వెళ్లే యువత తప్పనిసరిగా నిపుణుల సూచనలు పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాలకుర్తి సీఐ జానకిరాం రెడ్డి, ఎస్సై దూలం పవన్ కుమార్, ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, పలువురు యువకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

చిలుక సత్యం సాగర్ ని సన్మానించిన బీసీ సమాజ్.. చిలుక సత్యం సాగర్ ని సన్మానించిన బీసీ సమాజ్..
మేడ్చల్, తెలంగాణ ముచ్చట్లు: జాతీయ మానవ హక్కులు మరియు సామాజిక న్యాయ సంఘం వనపర్తి జిల్లా చైర్మన్ గా చిలుక సత్యం సాగర్  ఎన్నికైన సందర్భంగా మంగళ...
జాతీయ మానవ హక్కులు , సామాజిక న్యాయ సంఘం వనపర్తి జిల్లా చైర్మన్ గా చిలుక సత్యం సాగర్
బిగ్ యూత్ అసోసియేషన్ పలహార బండి ఊరేగింపు 
కాంగ్రెస్ ప్రభుత్వం కపట ప్రేమతో బిసి రిజర్వేషన్ నిరసనలు  
క్రీడాకారుల కోచ్ లకు ప్రోత్సాహం అందించండి బొంతు శ్రీదేవి యాదవ్
ప్రపంచ శాంతి సంఘం ఆధ్వర్యంలో హీరోషిమా డే సామ్రాజ్యవాద వ్యతిరేక దినోత్సవం
పాత‌ కూర‌గాయ‌ల మార్కెట్‌కు రూ.55 ల‌క్ష‌ల నిధులు నిధులు మంజూరు