పాలకుర్తిలో ఉక్కులాంటి  యువతరం తయారు కావాలి

డీసీపీ రాజా మహేంద్ర నాయక్

పాలకుర్తిలో ఉక్కులాంటి  యువతరం తయారు కావాలి

పాలకుర్తి,తెలంగాణ ముచ్చట్లు:

పాలకుర్తి మండలకేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం స్వాగత తోరణం ఎదురుగా స్థాపించిన ఛం జిమ్ సెంటర్‌ను డీసీపీ రాజా మహేంద్ర నాయక్ ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని వ్యాయామ శిక్షకుడు, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి చెరిపెల్లి అశోక్ మహర్షి ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ...యువతలో వ్యాయామ పరంగా చైతన్యం పెంచడం హర్షణీయమని, పాలకుర్తిలో ఇదే మొదటి వ్యాయామ కేంద్రంగా గుర్తుంచుకోవచ్చని పేర్కొన్నారు. ఆరోగ్య పరిరక్షణకు మందులు, చికిత్సలకు మాత్రమే పరిమితం కాకుండా వాకింగ్‌, జాగింగ్‌, యోగా, జిమ్ వంటి సాధనాల ద్వారా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

వయస్సు, లింగం, సామాజిక-ఆర్థిక పరిస్థితుల తేడా లేకుండా ప్రతిఒక్కరూ తమకు అనుకూలంగా వ్యాయామ సమయాన్ని కేటాయించుకోవాలన్నారు. చిన్నారుల ఎదుగుదలలో శారీరక శ్రమ, పౌష్టికాహారం కీలకమైందని పేర్కొన్నారు. జిమ్‌కు వెళ్లే యువత తప్పనిసరిగా నిపుణుల సూచనలు పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాలకుర్తి సీఐ జానకిరాం రెడ్డి, ఎస్సై దూలం పవన్ కుమార్, ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, పలువురు యువకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .