చిల్కానగర్ బోనాల ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

ఆలయాల అభివృద్ధికి 20 లక్షల నిధుల మంజూరు

చిల్కానగర్ బోనాల ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

ఉప్పల్, తెలంగాణ ముచ్చట్లు:

చిల్కానగర్ డివిజన్‌లో ఆదివారం జరిగే బోనాల ఉత్సవాల నేపథ్యంలో ఆలయాల వద్ద అన్ని అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ అధికారులను ఆదేశించారు. మారల్ మైసమ్మ, పోచమ్మ, మజ్జిగౌరమ్మ ఆలయాలతో పాటు ఇతర ఆలయాల పరిసర ప్రాంతాల్లో సౌకర్యాల కల్పన కోసం 20 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ నిధులు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సహకారంతో లభించాయని పేర్కొన్నారు.

శుక్రవారం జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్, జలమండలి, విద్యుత్, శానిటేషన్ శాఖల అధికారులతో కలిసి పలువురు ఆలయాలను సందర్శించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఆలయాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని శానిటేషన్ అధికారులను ఆదేశించారు. రాత్రి వేళ భక్తులకు ఇబ్బంది కలగకుండా వీధిదీపాలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.


WhatsApp Image 2025-07-25 at 9.52.00 PM (1)ఆలయాలకు వచ్చే మార్గాల్లో రహదారుల్లో గుంతలు లేకుండా ప్యాచ్‌వర్క్ చేయాలని ఇంజనీరింగ్ శాఖను కోరారు. బోనాల ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు పోలీస్ శాఖ తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఆలయం వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలు, మంచినీటి సరఫరా, విద్యుత్‌, వెలుగు, పారిశుధ్యం వంటి ఏర్పాట్లను పూర్తిచేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఈ వెన్నెల గౌడ్, ఏఈ రాధిక, వర్క్ ఇన్‌స్పెక్టర్ కేదార్, శానిటేషన్ డిపార్ట్‌మెంట్ డీఈ చందన, ఎలక్ట్రిసిటీ సిబ్బంది రాము, వాటర్ వర్క్స్ సిబ్బంది శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .