కూకట్‌పల్లి నియోజకవర్గ అభివృద్ధి పనులపై పర్యటన

ప్రాధాన్య రహదారి, బ్రిడ్జ్, క్రీడా ప్రాంగణాల ఏర్పాటుపై పరిశీలన

కూకట్‌పల్లి నియోజకవర్గ అభివృద్ధి పనులపై పర్యటన

కూకట్ పల్లి,తెలంగాణ ముచ్చట్లు:

కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్‌తో కలిసి నియోజకవర్గంలోని కెపిహెచ్‌బి, ఫతేనగర్ డివిజన్ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సమస్యల నివారణ, నగర అభివృద్ధి ప్రణాళికలపై అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు.

వసంతనగర్ కాలనీ నుంచి గోకుల్ ఫ్లాట్స్ మీదుగా హైటెన్షన్ రోడ్డుపై రైలు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి అవసరమైన ప్రదేశాన్ని పరిశీలించారు. కూకట్‌పల్లి హుడా ట్రక్ పార్క్ ప్రాంగణాన్ని క్రీడా మైదానంగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనపై సమీక్ష జరిపారు. జేఎన్టీయూ సర్కిల్ వద్ద ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి స్కై వే ఏర్పాటుపై చర్చించారు.

అలాగే, మూసాపేట ఆంజనేయ నగర్ చౌరస్తా వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం, కూకట్‌పల్లి వై జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ మరియు అండర్‌పాస్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఫతేనగర్ వెంకటేశ్వరనగర్‌లో శిథిలావస్థలో ఉన్న పాత నడక బ్రిడ్జ్‌ను పునర్నిర్మించాలని సూచించారు.
పర్యటనలో కార్పొరేటర్లు మందాడి శ్రీనివాసరావు, పండాల సతీష్ గౌడ్, ఎస్.సీ. చిన్నారెడ్డి, ఈఈ రమేష్, డీఈ శంకర్, ఏఈ రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

చిలుక సత్యం సాగర్ ని సన్మానించిన బీసీ సమాజ్.. చిలుక సత్యం సాగర్ ని సన్మానించిన బీసీ సమాజ్..
మేడ్చల్, తెలంగాణ ముచ్చట్లు: జాతీయ మానవ హక్కులు మరియు సామాజిక న్యాయ సంఘం వనపర్తి జిల్లా చైర్మన్ గా చిలుక సత్యం సాగర్  ఎన్నికైన సందర్భంగా మంగళ...
జాతీయ మానవ హక్కులు , సామాజిక న్యాయ సంఘం వనపర్తి జిల్లా చైర్మన్ గా చిలుక సత్యం సాగర్
బిగ్ యూత్ అసోసియేషన్ పలహార బండి ఊరేగింపు 
కాంగ్రెస్ ప్రభుత్వం కపట ప్రేమతో బిసి రిజర్వేషన్ నిరసనలు  
క్రీడాకారుల కోచ్ లకు ప్రోత్సాహం అందించండి బొంతు శ్రీదేవి యాదవ్
ప్రపంచ శాంతి సంఘం ఆధ్వర్యంలో హీరోషిమా డే సామ్రాజ్యవాద వ్యతిరేక దినోత్సవం
పాత‌ కూర‌గాయ‌ల మార్కెట్‌కు రూ.55 ల‌క్ష‌ల నిధులు నిధులు మంజూరు