మౌలిక వసతుల కోసం ఎమ్మెల్యేకు కాలనీవాసుల వినతి
Views: 4
On
మల్కాజిగిరి, తెలంగాణ ముచ్చట్లు:
మల్కాజిగిరి నియోజకవర్గంలోని ఎన్ఎండీసీ కాలనీ వీధి సంఖ్య 3లో మౌలిక సదుపాయాల కొరతపై స్థానికులు శాసనసభ్యుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో శనివారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన వారు, కాలనీలో సీసీ రోడ్లు వేయాలని, త్రాగునీటిలో ఒత్తిడి సమస్యను పరిష్కరించాలని, పారిశుద్ధ్య నిర్వహణను బలోపేతం చేయాలని, ఫాగింగ్ నిర్వహణ చేపట్టాలని కోరారు.
వినతిపై స్పందించిన శాసనసభ్యుడు సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం అందజేసి, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ప్రభాకర్ గౌడ్, సాయికృష్ణ పరాశర్, శరత్ కుమార్, వరలక్ష్మి, ఎంఎస్ నారాయణ, శ్రీనివాస్, వెంకట చారి, మోహన్ రావు, తేజ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
04 Aug 2025 22:25:25
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు:
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
Comments