కొప్పూరు - కొత్తపల్లి బ్రిడ్జిని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్
Views: 17
On
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూరు నుండి కొత్తపల్లి రోడ్డు వరకు రూ. 329 లక్షల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జిని రాష్ట్ర రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు.
రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, స్థానిక తహసిల్దార్ రాజేష్, ఎంపీడీవో వీరేశం, పంచాయతీరాజ్ అధికారులతో పాటు స్థానిక నాయకులతో కలిసి కొబ్బరికాయ కొట్టి శిలాఫలకాన్ని ఆవిష్కరించి బ్రిడ్జిని ప్రారంభించారు. అదేవిధంగా కొత్తకొండలోని శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం వద్ద త్రిశూలం చౌరస్తా కు మంత్రి పొన్నం ప్రభాకర్ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. అనంతరం ఆలయంలో శ్రీ వీరభద్ర స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments