దివంగత నటుడు కోట సతీమణి కోట రుక్మిణి హఠాన్మరణం

దివంగత నటుడు కోట సతీమణి కోట రుక్మిణి హఠాన్మరణం

హైదరాబాద్, ఆగస్టు 18: 

దివంగత నటుడు కోట శ్రీనివాసరావు సతీమణి కోట రుక్మిణి హఠాన్మరణం చెందారు. అనారోగ్య కారణాలతో ఆమె మృతి చెందినట్టు సమాచారం. ఇటీవలే కోట శ్రీనివాసరావు చనిపోవడంతో అప్పటి నుంచి ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించినట్టు తెలుస్తోంది. రుక్మిణి వయస్సు 75 సంవత్సరాలు.సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో రుక్మిణి కన్నుమూశారు. ఈ మేరకు కుటుంబసభ్యులు అధికారికంగా ప్రకటించారు.

ఇలా ఉండగా దివంగత నటుడు కోట శ్రీనివాసరావు(83) జులై 13 ఆదివారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానం స్మశానవాటికలో కోట అంత్యక్రియలు జరిగాయి.

1942 జులై 10వ తేదీన కృష్ణా జిల్లా కంకిపాడులో కోట జన్మించారు. 1978లో 'ప్రాణం ఖరీదు' సినిమాతో ఆయన సినిమాల్లో అరంగేట్రం చేశారు. 750కి పైగా సినిమాల్లో కోట శ్రీనివాసరావు నటించారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు. తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలోనూ నటించారు. ప్రతిఘటన సినిమాతో విలన్‌గా మంచి గుర్తింపు పొందారు. 2015లో కోట శ్రీనివాసరావు పద్మశ్రీ అవార్డు సైతం అందుకున్నారు. కోట 9 నంది అవార్డులు, సైమా అవార్డు అందుకున్నారు. కాగా, ఇప్పుడు కోట భార్య కూడా తనువు చాలించడంతో కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .