ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజాపాలనకు ప్రథమ ధ్యేయం 

నెమలి అనిల్ కుమార్

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజాపాలనకు ప్రథమ ధ్యేయం 

IMG-20251207-WA0022మల్లాపూర్, డిసెంబర్ 07 (తెలంగాణ ముచ్చట్లు)

మల్లాపూర్‌ డివిజన్‌ స్వామి వివేకానంద నగర్‌ కాలనీ ఫేజ్–3లో “బస్తీ బాట” కార్యక్రమం భాగంగా పర్యటించిన గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్, కాలనీ ప్రజలతోసమావేశమై సమస్యలను తెలుసుకున్నారు.కాలనీలో తాగునీరు, డ్రైనేజ్‌, వీధి దీపాల వంటి అంశాలను కాలనీ వాసులు వివరించగా, వాటి పరిష్కారానికి తమవంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలు తెలుసుకొని వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ద్వారానే ప్రజలకు నిజమైన ప్రజాపాలన అందుతుందని అన్నారు. ఉప్పల్ కాంగ్రెస్ ఇంచార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి సహకారంతోపెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారమయ్యేలా కృషి చేస్తామని నెమలి అనిల్ కుమార్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు సానాల రవికుమార్, ప్రధాన కార్యదర్శి పైళ్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు పల్లె శివగౌడ్, సంయుక్త కార్యదర్శులు పైళ్ల గౌతమ్, అరుణ్‌కుమార్, సభ్యులు రాములు గౌడ్, దయాకర్, నవీన్, సైదులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

శ్రీశైలంలో నీళ్లున్నా సాగుకు అందించలేని అసమర్థ ప్రభుత్వం. శ్రీశైలంలో నీళ్లున్నా సాగుకు అందించలేని అసమర్థ ప్రభుత్వం.
కేఎల్‌ఐ పంపులు 24 గంటలు నడపాలి.. నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రేవల్లి,సెప్టెంబర్11(తెలంగాణ ముచ్చట్లు):  శ్రీశైలం ప్రాజెక్టులో సమృద్ధిగా నీళ్లు ఉన్నప్పటికీ...
మంగంపల్లి ఆలయాల అభివృద్ధికి రూ.కోటి.
ఫారం 6తో యువత ఓటరుగా నమోదు కావాలి.
గణేష్‌ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి.!
ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి.
వీరవనిత ఐలమ్మ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలి.
22–ఏ భూముల సమస్యను పరిష్కరించాలి.