మాఇల్లు ఆశ్రమంలో జనసేనాని జన్మదిన వేడుకలు.
ఆశ్రమ పిల్లలతో కేక్ కట్ చేసిన జనసేన ఇంచార్జ్ గాదె పృథ్వి.
Views: 31
On
జఫర్గడ్: జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. మండలంలోని మాఇల్లు ప్రజాదరణ ఆశ్రమంలో జనసైనికులు ఏర్పాటు చేసిన అన్నదానం, ఆశ్రమ పిల్లలతో సహాపంక్తి భోజన కార్యక్రమంలో జనసేనపార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ గాదె పృథ్వి పాల్గొని విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం ఆశ్రమ ఆవరణలో మొక్కలు నాటారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి వేడుకలు ఆశ్రమ పిల్లలతో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు మహమ్మద్ రజాక్, మినుముల సంజయ్, భూక్యా హుస్సేన్, కొలిపాక వంశీకృష్ణ,సయ్యద్ కాశీం,మునిగాల పవన్,గ్యార బన్నీ, విశాల్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
01 May 2026 18:59:52
వనపర్తి,మే01(తెలంగాణ ముచ్చట్లు)
అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని గాంధీభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామానికి చెందిన తెలంగాణ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్...


Comments