మిస్ ఇండియా -2024' గా నిఖిత పోర్వాల్

మిస్ ఇండియా -2024' గా నిఖిత పోర్వాల్

 డెస్క్,తెలంగాణ ముచ్చట్లు:
ఈ ఏడాది ఫెమినా మిస్ ఇండియా  (Femina Miss India 2024) కిరీటాన్ని నిఖిత పోర్వాల్ (Nikita Porwal) సొంతం చేసుకున్నారు. ముంబయిలోని ఫేమస్ స్టూడియోస్లో జరిగిన ఈవెంట్లో మధ్యప్రదేశ్ కు  చెందిన నిఖిత విజయం సాధించారు. మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరఫున ఆమె ప్రాతినిధ్యం వహించనున్నారు. రేఖా పాండే, ఆయుశీ దోలకియా మొదటి, రెండవ రన్నరప్ గా  నిలిచారు.60వ ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో భాగంగా 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అందాల భామలు పోటీపడ్డారు. కేవలం తమ అందాలతోనే కాదప్రతిభతోనూ జడ్జిల నుంచిప్రశంసలు అందుకున్నారు.తుది పోరులో అదరగొట్టిన నిఖిత పోర్వాల్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. టైటిల్ గెలిచిన తర్వాత సోషల్ మీడియా వేదికగా ఉజ్జయినికి చెందిన నిఖిత తనఆనందాన్ని వ్యక్తంచేశారు. "ఇప్పుడు నేను అనుభవిస్తోన్న ఆనందాన్ని వర్ణించలేను. ఇదంతా ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.. కానీ నా తల్లిదండ్రుల కళ్లలోని ఆనందం చూసి గర్వంగా ఉంది. నా ప్రయాణంఇప్పుడే మొదలైంది. ఇంకా నేను సాధించాల్సిన విజయాలు చాలా ఉన్నాయి” అని ఆమె సంతోషం
వ్యక్తంచేశారు. గతేడాది మిస్ ఇండియాగా నిలిచిన నందినిగుప్తా విజేతకు కిరీటాన్ని అలంకరించారు. ఇక,రన్నరప్ లు రేఖ స్వస్థలం దాద్రా అండ్ నగర్ హవేలీ కాగా.. ఆయుశీది గుజరాత్.

Tags:

Post Your Comments

Comments

Latest News

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన 
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
మీనాక్షి నటరాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు గట్టు రాజు 
భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి నందుకు కార్పొరేటర్ కు సంతోషం వ్యక్తం చేసిన కాలనీవాసులు. 
బోనాల పండుగ ఉత్సవాల లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
దమ్మాయిగూడ జాతీయ మాల మహానాడు సంఘం అధ్యక్షులుగా 
50వ వివాహ వార్షికోత్సవ వేడుకలు బాబా సాహెబ్ సన్నిధిలో 
మల్లాపూర్ అంబేద్కర్ సంఘం బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న