యూకే సినీప్లెక్స్ 4-స్క్రీన్ మల్టిప్లెక్స్ సినిమా థియేటర్ ప్రారంభోత్సవం 

ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి 

యూకే సినీప్లెక్స్ 4-స్క్రీన్ మల్టిప్లెక్స్ సినిమా థియేటర్ ప్రారంభోత్సవం 

ప్రముఖ నిర్మాత  దిల్ రాజు

నాచారం, తెలంగాణ ముచ్చట్లు:

హైదరాబాద్ కు కొత్త సినిమా ప్రపంచం యూకే సినీప్లెక్స్ నాచారం లో అత్యంత విలాసవంతమైన అనుభవం. వినోదానికి నూతన శిఖరం.

ఉప్పల్ నియోజకవర్గంనాచారం డివిజన్ లో యూకే సినీప్లెక్స్ 4-స్క్రీన్ మల్టిప్లెక్స్ సినిమా థియేటర్ ప్రారంభోత్సవం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ప్రముఖ నిర్మాత  దిల్ రాజు. హైదరాబాద్  నగరంలో వినోదానికి సంబంధించిన దృశ్యం మరో మెట్టు పైకి వెళుతోంది.నాచారం హృదయంలో నూతనంగా ప్రారంభమవుతున్న యూకే సినీప్లెక్స్,ఒక విలాసవంతమైన 
4-స్క్రీన్ మల్టిప్లెక్స్.ఇది కేవలం సినిమా థియేటర్ మాత్రమే కాదు ఇది ఓ అనుభూతి. అత్యాధునిక సాంకేతికతతో పాటు, అత్యుత్తమ సౌకర్యాలు కలిగిన ఈ సినీప్లెక్స్ సినిమా ప్రేమికులకు, కుటుంబాలకు ప్రీమియం అనుభవాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంది. 

ఇక్కడ అందరూ ఆస్వాదించగల సౌకర్యాలు ఉన్నాయి  మృదువైన సీటింగ్, ప్రీమియం రీక్లైనర్లు, సౌకర్య వంతమైన సోఫాలు,  అట్మోస్  సౌండ్, లేజర్ ప్రొజెక్షన్ మరియు సిల్వర్ స్క్రీన్లు – ప్రతి అంశం ప్రేక్షకులను ఒక సినిమాటిక్ ప్రపంచంలోకి తీసుకెళ్లేలా రూపొందించబడింది. దీనితో పాటు, లైవ్ కౌంటర్లు, పిజ్జాలు, శాండ్విచ్లు, డెజర్ట్లు వంటి రుచికరమైన ఫుడ్ & బివరేజెస్ కూడా అందుబాటులో ఉన్నాయి అన్నీ ఒకే గదిలో!

 ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమ ప్రముఖుల సమక్షంలో: భరత్ నారాగ్ ,సునీల్ నారాగ్ ప్రముఖ నిర్మాత  దిల్ రాజు , శిరీష్ రెడ్డి, పృతికా ఉదయ్, రుషిల్ ఉదయ్,
రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డి , సనత్ నగర్ ఎమ్మెల్యే  తలసాని శ్రీనివాస్ యాదవ్ , ఎమ్మెల్యే దానం నాగేందర్, 
కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్.


WhatsApp Image 2025-07-30 at 8.31.53 PMయు కె  సినీప్లెక్స్ నాచారం లో ఆగస్టు 31 నుండి ప్రజలకు అందుబాటులోకి వచ్చినది ఇక్కడ సాంకేతికత, విలాసం మరియు రుచి అన్నీ కలిసే వినోదానికి కొత్త నిర్వచనం అందించబోతున్నాయి.
వారాంతపు బ్లాక్బస్టర్ అయినా కావచ్చు, ఆకస్మికంగా ప్లాన్ చేసిన మూవీ నైట్ అయినా కావచ్చు – యూకే సినీప్లెక్స్ నాచారం మీకు అద్భుతమైన వినోదానికి శ్రేష్ఠమైన గమ్యస్థానం.

Tags:

Post Your Comments

Comments

Latest News

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన 
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
మీనాక్షి నటరాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు గట్టు రాజు 
భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి నందుకు కార్పొరేటర్ కు సంతోషం వ్యక్తం చేసిన కాలనీవాసులు. 
బోనాల పండుగ ఉత్సవాల లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
దమ్మాయిగూడ జాతీయ మాల మహానాడు సంఘం అధ్యక్షులుగా 
50వ వివాహ వార్షికోత్సవ వేడుకలు బాబా సాహెబ్ సన్నిధిలో 
మల్లాపూర్ అంబేద్కర్ సంఘం బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న