నేర నిందితులను పట్టుకొవడంలో పోలీస్‌ జాగిలం కీలకం

వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

నేర నిందితులను పట్టుకొవడంలో పోలీస్‌ జాగిలం కీలకం

హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:
నేరాలకు పాల్పడిన నిందితులను పట్టుకోవడం పోలీసు జాగిలాలు కీలకంగా నిలుస్తున్నాయని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు  నూతనంగా వచ్చిన పోలీస్‌ జాగిలాలను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ మంగళవారం పరిశీలించారు. గత 28వ తేదిన మొయినాబాద్‌లోని పోలీస్‌ జాగిలాల శిక్షణా కేంద్రంలో ఎనిమిది నెలల శిక్షణను పూర్తి చేసుకోని వచ్చిన ఐదు పోలీస్‌ జాగిలాలు వరంగల్‌ కమిషనరేట్‌ పోలీస్‌ డాగ్‌ స్వ్కాడ్‌లో చేరి విధులు నిర్వహించేందుకు సిద్దమయినాయి. ప్రేలుడు పదార్థాలను పసిగట్టే ఈ ఐదు జాగిలాల్లో మూడు బెల్జియన్‌ మాలినోస్‌, రెండు గొల్డెన్‌ రీట్రీవర్‌ జాతులకు చెందిన జాగిలాలు, వీటికి  రానా, జానీ, డయానా, మాక్స్‌, కైరో గా నామకరణం చేయడం జరిగింది. నూతనంగా వచ్చిన ఈ జాగిలాలను సంబంధించిన పూర్తి వివరాలను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌కు హ్యాండ్లర్లు వివరించారు. గతంలోని జాగిలాలు ఎన్నో ప్రేలుడు పదార్థాలను పసిగట్టడంలో విజయం సాధించాయని ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ గుర్తు చేసారు. నూతనంగా వచ్చిన జాగిలాలకు మెరుగైన వసతిని ఏర్పాటు చేయాల్సిందిగా సిపి సంబంధిత అధికారులను ఆదేశించారు.WhatsApp Image 2025-03-04 at 6.06.09 PM
ఈ కార్యక్రమములో అదనపు డిసిపి సురేష్‌కుమార్‌, ఆర్‌.ఐ శ్రీనివాస్‌, డాగ్‌ స్వ్కాడ్‌ ఇంచార్జ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ ప్రభాకర్‌తో పాటు హ్యాండ్లర్లు రాజేష్‌ కుమార్‌, వెంకన్య, సురేష్‌, దిలిప్‌లు పాల్గోన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రాణాలకు ముప్పు… హుజురాబాద్ వద్ద వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్‌కు గట్టి వ్యతిరేకం. ప్రాణాలకు ముప్పు… హుజురాబాద్ వద్ద వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్‌కు గట్టి వ్యతిరేకం.
హుజురాబాద్, మే 2(తెలంగాణ ముచ్చట్లు ): హుజురాబాద్ పట్టణానికి సమీపంలోని సిర్సపల్లి గ్రామ శివారులో ప్రతిపాదించిన వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలని వేస్ట్...
పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణం.
పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్.!
పెద్దమందడి సింగిల్ విండో సీఈవో జగదీశ్వర్ రెడ్డికి ఘన వీడ్కోలు.
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం.
వేలేరు మండల కేంద్రంలో ఘనంగా మే డే వేడుకలు.
ప్రపంచ కార్మికులారా ఏకంకండి నినాదాలతో మేడే.