వ‌ర్షాకాలంలో అధికారులంతా అప్ర‌మ‌త్తంగా ఉండాలి

ఎవ‌రూ హెడ్ క్వార్ట‌ర్ ను విడిచి వెల్ల‌కూడ‌దు

వ‌ర్షాకాలంలో అధికారులంతా అప్ర‌మ‌త్తంగా ఉండాలి

-ఆగ‌స్టు మొద‌టి వారంలో స్పెషల్ డ్రైవ్

-పీఆర్ఆర్డీ స‌మీక్ష స‌మావేశంలో మంత్రి సీత‌క్క‌

హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:

 గ్రామాల్లో ప‌చ్చ‌ద‌నం స్వ‌చ్చ‌ద‌నం పెంచేలా ఆగ‌స్టు మొద‌టి వారంలో ప్ర‌త్యేక డ్రైవ్ నిర్వ‌హించాల‌ని పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డా.ద‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క ఆదేశాలు జారీ చేశారు. భారీవ‌ర్షాల‌తో గ్రామీణ ర‌హ‌దారులు దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉన్నందున..స‌త్వ‌ర‌మే పునురుద్ద‌ర‌ణ‌ప‌నులు చేప‌ట్టేలా చ‌ర్య‌లు తీసుకోవాలన్నారు. నిత్య ప‌ర్య‌వేక్ష‌ణ కోసం పంచాయ‌తీరాజ్ ఇంజ‌నీరింగ్ విభాగం హెడ్ ఆఫీస్ లో డీఈ, ఎస్ఈ ల‌తో మానిట‌రింగ్ సెల్ ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. శుక్ర‌వారం నాడు స‌చివాలయంలో పీఆర్ ఆర్డీ శాఖ‌పై మంత్రి సీత‌క్క జిల్లా అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్లు, జెడ్పీ సీఈఓలు, డీపీఓల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఆయా జిల్లాల్లో నెల‌కొన్న ప‌రిస్ధితుల‌పై ఆరా తీశారు. రూర‌ల్ డ్రికింగ్ వాట‌ర్, సానిటేష‌న్, రూర‌ల్ రోడ్స్, ప్లాంటేష‌న్ పై స‌మీక్ష నిర్వ‌హించారు.  వెగ‌వంతం చేయాల‌ని పేర్కొన్నారు. వ‌న‌మ‌హెత్స‌వంలో భాగంగా  2.44 కోట్ల మొక్క‌లు నాటిన‌ట్లు అధికారులు నివేదించ‌గా ...వేగం పెంచాల‌ని మంత్రి ఆదేశించారు. 

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .