కళాకారులను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత.
పలుస శంకర్ గౌడ్ జిల్లా సాహితీ కళావేదిక అధ్యక్షులు .
Views: 0
On
పెబ్బేరు,సెప్టెంబర్04(తెలంగాణ ముచ్చట్లు):
కళాకారులు సమాజానికి, సంస్కృతికి ప్రతిబింబాలని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ అన్నారు. పెబ్బేరు పట్టణంలో వీఎంసీ సంగీత రికార్డింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఔత్సాహిక గాయకులు, కళాకారులను ప్రోత్సహిస్తున్న యెల్లా రెడ్డి అభినందనీయులని పేర్కొన్నారు.ఈ సందర్భంగా యెల్లా రెడ్డిని శాలువా, జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. గ్రామీణ ప్రాంతాల్లోని కళాకారుల ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి సంగీత కేంద్రాలు ఎంతో అవసరమన్నారు. తెలంగాణ జానపద కళలను పరిరక్షించి, భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.కార్యక్రమంలో పృథ్వీరాజ్, వెంకటస్వామి, షఫీ, చంద్రయ్య, విష్ణు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
04 Sep 2026 21:22:45
వీణవంక, సెప్టెంబర్ 04 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కల్వల–బ్రాహ్మణపల్లి గ్రామాల మధ్య వాగుపై నిర్మించిన చెక్డ్యామ్ అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారిందని...


Comments