గోపాల్పూర్లో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ గ్రామ కమిటీలు.
ఎల్కతుర్తి ఆగస్టు 31 (తెలంగాణ ముచ్చట్లు):
ఎల్కతుర్తి మండలంలోని గోపాల్పూర్ గ్రామంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. మండల ఎంఎస్పీ అధ్యక్షుడు కె. రాజేందర్, ఎమ్మార్పీఎస్ మండల అధికార ప్రతినిధి జూపాక మధుకర్, మండల ప్రధాన కార్యదర్శి ఎల్తూరి వినయ్ ఆధ్వర్యంలో నూతన గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు.
ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షుడిగా నమిండ్ల నరేష్, ఉపాధ్యక్షుడిగా ఎల్తూరి రాజేష్, ప్రధాన కార్యదర్శిగా అజయ్ ఎన్నికయ్యారు. అలాగే ఎంఎస్పీ గ్రామ అధ్యక్షుడిగా మంద అనిల్ను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షుడు నమిండ్ల నరేష్ మాట్లాడుతూ.. తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ గ్రామంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ కార్యకలాపాలను బలోపేతం చేస్తామని తెలిపారు. అణగారిన వర్గాల సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు ఐక్యంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. తమను ఎన్నుకున్న నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


Comments