గుర్తుతెలియని వ్యక్తి మృతి.. ఆచూకీ కోసం పోలీసుల ప్రయత్నం.
జమ్మికుంట టౌన్ ఆగస్టు 24 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన వెలుగుచూసింది. సుమారు 40 నుంచి 45 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి గత వారం రోజులుగా గ్రామంలో తిరుగుతూ ప్లాస్టిక్ సామగ్రిని సేకరిస్తూ, దొరికిన ఆహారం తింటూ జీవిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. గ్రామపంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న పాడుబడిన హోటల్లో రాత్రివేళ నిద్రించేవాడని చెప్పారు.
ఆ వ్యక్తి ఆదివారం (ఆగస్టు 23) పాడుబడిన హోటల్లో మృతిచెందినట్లు గుర్తించారు. మృతుడి ఎడమ చేతిపై ‘ఏయూ’ అక్షరాలతో టాటూ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు లేదా అతడిని గుర్తుపట్టిన వారు సమీప పోలీస్స్టేషన్ను సంప్రదించాలని కోరారు.
మృతుడి వివరాలు గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సమాచారాన్ని ప్రజలకు చేరేలా ప్రచురించాలని పోలీసు అధికారులు పాత్రికేయ మిత్రులను కోరారు.


Comments