పెద్దమందడి జిపిఓ కాశన్న అకాల మృతి.
కుటుంబానికి తహసీల్దార్ మల్లికార్జున్, సిబ్బంది ప్రగాఢ సానుభూతి.
Views: 0
On
పెద్దమందడి,ఆగస్టు29(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండల రెవెన్యూ శాఖలో సుమారు ఆరు నెలల క్రితం జాయిన్ అయిన కాశన్న, జిపిఓగా బాధ్యతలు స్వీకరించి నెల రోజుల పాటు విధులు నిర్వహించారు. అనంతరం అనారోగ్య కారణాలతో సెలవులో ఉంటూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం చికిత్స పొందుతూ అకాల మరణం చెందారు. ఆయన మృతి పట్ల స్థానికులు, సహచర ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.కాశన్న మృతి విషయం తెలుసుకున్న పెద్దమందడి తహసీల్దార్ మల్లికార్జున్, వనపర్తి ఆర్డిఓ, రెవెన్యూ సిబ్బంది ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. కాశన్న మృతి పట్ల పలువురు అధికారులు, రెవెన్యూ సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
29 Aug 2026 21:30:52
జమ్మికుంట టౌన్ ఆగస్టు 29 (తెలంగాణ ముచ్చట్లు):
పట్టణంలోని విస్డం కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు టీసీలు (ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు) ఇవ్వకుండా కళాశాల యాజమాన్యం తిప్పించుకుంటోందని...


Comments