విశ్వకర్మ కార్పెంటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కు నూతన కార్యవర్గం.
జమ్మికుంట టౌన్ ఆగస్టు 26 (తెలంగాణ ముచ్చట్లు):
విశ్వకర్మ కార్పెంటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీకి మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ శుభాకాంక్షలు తెలిపారు. జమ్మికుంట పట్టణ పరిధిలో నిర్వహించిన అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై నూతన కమిటీ సభ్యులను అభినందించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.. జూపాక శ్రీనివాస చారి అధ్యక్షతన ఏర్పడిన నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. విశ్వకర్మ కార్పెంటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎంతో పెద్దదని, ఇంతటి బలమైన సభ్యత్వంతో ఉన్న సంఘాలు అరుదుగా ఉంటాయని పేర్కొన్నారు. జమ్మికుంట పట్టణంలో నివసిస్తున్న ఒక పౌరుడిగా, అసోసియేషన్ సభ్యుల సంక్షేమానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడం, పెన్షన్లు, ఇళ్ల మంజూరు, రోడ్లు తదితర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా తన పరిధిలో పూర్తి సహకారం అందిస్తానని స్పష్టం చేశారు. అసోసియేషన్కు సంబంధించిన ప్రతి విషయంలోనూ తన శక్తిమేరకు అండగా ఉంటానని తెలిపారు.
కార్యక్రమానికి తనను ఆహ్వానించిన అసోసియేషన్ నాయకులు, సభ్యులకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో నూతన అధ్యక్షుడు జూపాక శ్రీనివాస చారి, రాజు చారి, సంపత్ చారి, నూతన కమిటీ సభ్యులు, అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు


Comments