స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన మిత్రబృందం.

స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన మిత్రబృందం.

వేలేరు, ఆగస్టు 29 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన గజవెళ్లి నాగరాజు తండ్రి గజవెళ్లి కుమారస్వామి ఇటీవల మృతి చెందగా, ఆయన కుటుంబాన్ని తోటి స్నేహితులు పరామర్శించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.
కుటుంబానికి కొంతైనా అండగా నిలవాలనే ఉద్దేశంతో స్నేహితులు కలిసి 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాగరాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, కష్టకాలంలో తాము ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు.
స్నేహం అనేది సంతోషాలను పంచుకోవడమే కాకుండా, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అండగా నిలవడంలోనే నిజమైన విలువ ఉందని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మరిజె రామకృష్ణ, నక్క సంపత్, ఏలూరి కరుణాకర్, దామెర రాజేష్, లోనే శివాజీ, కొయ్యడ వంశీ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

టీసీల కోసం విద్యార్థుల ధర్నా. టీసీల కోసం విద్యార్థుల ధర్నా.
జమ్మికుంట టౌన్ ఆగస్టు 29 (తెలంగాణ ముచ్చట్లు): పట్టణంలోని విస్డం కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు టీసీలు (ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్లు) ఇవ్వకుండా కళాశాల యాజమాన్యం తిప్పించుకుంటోందని...
పెద్దమందడి జిపిఓ కాశన్న అకాల మృతి.
గ్రామాల బాట పట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్.
టీసీల కోసం విద్యార్థుల ధర్నా.
స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన మిత్రబృందం.
సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా ఓరియంటేషన్ ప్రోగ్రాం.
డ్రైనేజీలోకి దూసుకెళ్లిన బైక్.. వ్యక్తికి తీవ్ర గాయాలు.