క్రీడా ప్రతిభకు వేదిక.. సెప్టెంబర్ 9న ఎంపికలు.
ఎల్కతుర్తి, ఆగస్టు 29 (తెలంగాణ ముచ్చట్లు):
ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఎంఈఓ చదువుల సత్యనారాయణ ఆదేశాల మేరకు మండల ఎస్జీఎఫ్ సమావేశం కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్లో నిర్వహించారు. మండల సెక్రటరీ ఎం. ధనలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మండల స్థాయిలో నిర్వహించే అండర్-14, అండర్-17 బాలబాలికల కబడ్డీ, కోకో క్రీడలకు క్రీడాకారుల ఎంపికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 2026 సెప్టెంబర్ 9న మండల స్థాయి క్రీడా ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఎస్జీఎఫ్ సెక్రటరీ ఎం. ధనలక్ష్మి మాట్లాడుతూ క్రీడాకారులు సెప్టెంబర్ 9న ఉదయం 9 గంటలలోపు కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తప్పనిసరిగా ఆధార్ నంబర్, పెన్ నెంబర్ వెంట తీసుకురావాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పీడీలు, పీఈటీలు బి. సుధాకర్, జి. శ్రీకాంత్, ఆర్. ఉదయ్, కె. తిరుపతి, సిహెచ్. పూర్ణిమ, టి. రాములు, జి. ప్రేమ ప్రసాద్రావు, ఎం. ఉషారాణి, ప్రభావతి, బి. స్వరూప, బి. కిరణ్రావు తదితరులు పాల్గొన్నారు.


Comments