పామిరెడ్డిపల్లిలో వికసిత్ ప్రణాళికకు శ్రీకారం.

పామిరెడ్డిపల్లిలో వికసిత్ ప్రణాళికకు శ్రీకారం.

పెద్దమందడి,ఆగస్టు29(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళికలో భాగంగా తొలి గ్రామసభను సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం అధ్యక్షతన నిర్వహించారు. గ్రామంలో అవసరమైన మౌలిక వసతులు, రైతులకు ఉపయోగపడే అభివృద్ధి పనులపై చర్చించారు.జలసిరి కార్యక్రమంలో భాగంగా బోరుబావుల పునరుద్ధరణ గుంతలు, నీటి నిల్వ కుంటలు, పొలాల్లో నీటి కుంటలు, ఇంకుడు గుంతలు, ఇంటింటా ఇంకుడు గుంతలు, పండ్ల తోటలు, పశువుల కొట్టాలు, గొర్రెల కొట్టాలు, నాటుకోళ్ల పెంపకం వంటి పనులకు అవకాశం ఉన్నట్లు రైతులకు వివరించారు. ఈ పనుల కోసం రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.గ్రామంలో అవసరమైన పనులను గుర్తించి గ్రామపంచాయతీ ఆమోదంతో చేపట్టాలని సూచించారు. వచ్చే నెల 8వ తేదీ వరకు రెండో గ్రామసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. అప్పటిలోగా గ్రామ ప్రజలు, రైతులు తమకు అవసరమైన పనులకు దరఖాస్తులు సమర్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల కార్యక్రమ అధికారి సురేష్, సాంకేతిక సహాయకుడు సురేష్, ఉపసర్పంచ్ రాములమ్మ, వార్డు సభ్యులు నరేష్, పద్మ, మాజీ ఎంపీటీసీ ఇందిరా లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్ తిక్కన్న, పంచాయతీ కార్యదర్శి స్రవంతి, క్షేత్ర సహాయకుడు ఆనంద్‌తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

టీసీల కోసం విద్యార్థుల ధర్నా. టీసీల కోసం విద్యార్థుల ధర్నా.
జమ్మికుంట టౌన్ ఆగస్టు 29 (తెలంగాణ ముచ్చట్లు): పట్టణంలోని విస్డం కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు టీసీలు (ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్లు) ఇవ్వకుండా కళాశాల యాజమాన్యం తిప్పించుకుంటోందని...
పెద్దమందడి జిపిఓ కాశన్న అకాల మృతి.
గ్రామాల బాట పట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్.
టీసీల కోసం విద్యార్థుల ధర్నా.
స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన మిత్రబృందం.
సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా ఓరియంటేషన్ ప్రోగ్రాం.
డ్రైనేజీలోకి దూసుకెళ్లిన బైక్.. వ్యక్తికి తీవ్ర గాయాలు.