ఏ ఎస్ రావు నగర్ లో జోయాలుక్కాస్ ‘బ్రిల్లియన్స్’ డైమండ్ ప్రదర్శన ప్రారంభం

ఏ ఎస్ రావు నగర్ లో జోయాలుక్కాస్ ‘బ్రిల్లియన్స్’ డైమండ్ ప్రదర్శన ప్రారంభం

ఏ ఎన్ రావు నగర్, డిసెంబర్ 05 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా మున్సిపల్ పరిధిలోని డా. ఎ.ఎస్. రావు నగర్‌లో జోయాలుక్కాస్ షోరూమ్‌లో ‘బ్రిల్లియన్స్’ డైమండ్ జ్యువెలరీ షో డిసెంబర్ 5 నుంచి 21 వరకు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. విలాసవంతమైన వివాహ సెట్ల నుంచి స్టైలిష్ డైలీ వేర్ వరకు విభిన్నమైన వజ్రాభరణాలను ఈ ప్రత్యేక ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు. ప్రతి డిజైన్ ప్రత్యేకమైనదిగా ఉండి, ప్రదర్శన కాలంలో మాత్రమే కస్టమర్లకు లభ్యమవుతుందని సంస్థ వెల్లడించింది.జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జోయాలుక్కాస్ మాట్లాడుతూ…“వజ్రాల శాశ్వత అందాన్ని, డిజైన్ కళలోని నైపుణ్యాన్ని జరుపుకునే వేడుక ఇది. ఎ.ఎస్.రావు నగర్ మా ప్రయాణంలో ఎంతో ప్రత్యేకమైన ప్రాంతం” అని తెలిపారు.ప్రదర్శన సందర్భంగా రూ.1 లక్షకు పైగా వజ్రాభరణాలు కొనుగోలు చేసే కస్టమర్లందరికీ ఉచిత బంగారు నాణెం అందజేస్తామని సంస్థ ప్రకటించింది.ఈ ప్రత్యేక డైమండ్ షో డిసెంబర్ 21 వరకు ఎ.ఎస్.రావు నగర్ జోయాలుక్కాస్ షోరూమ్‌లో కొనసాగుతుంది. వజ్రాల కళ, అందం, నైపుణ్యం— అనుభవించేందుకు ఇది అరుదైన అవకాశమని నిర్వాహకులు తెలిపారు.ఈకార్యక్రమంలో రీజనల్ మేనేజర్ సునీల్ పీఎస్, రీజనల్ మార్కెటింగ్ మేనేజర్ కె. శ్రీనివాస్, జోయాలుక్కాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.IMG-20251205-WA0199

Tags:

Post Your Comments

Comments

Latest News

కూరగాయల సాగులో మెళకువలపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం కూరగాయల సాగులో మెళకువలపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం
మేడ్చల్–మల్కాజిగిరి, డిసెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వాతావరణానికి అనువైన వంగడాల పెంపకం, కూరగాయల నిల్వ కాలాన్ని పెంచే విధానాలు, పంట అనంతరం తీసుకోవాల్సిన యాజమాన్య...
పిసిపిఎన్‌డిటి నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి
కలెక్టర్ కార్యాలయంలో  ప్రజావాణికి 107 ఫిర్యాదులు
సర్పంచ్‌గా మమతకు మద్దతుగా ఇంటింటా ప్రచారం చేసిన ఎర్రబెల్లి బండారి లక్ష్మారెడ్డి
కాప్రా మున్సిపల్ డీసీ జగన్‌పై సర్వత్రా నిరసనలు
సైబర్ మోసాల పట్ల అప్రమత్తం
క్రిటికల్ పోలింగ్ స్టేషన్ సందర్శించిన కల్లూరు ఏసిపి